S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/02/2016 - 17:21

హైదరాబాద్: ఖైరతాబాద్ లో శ్రీ శివశక్తి పీఠ నాగేంద్ర మహా గణపతిగా 58 అడుగుల ఎత్తులో కొలువుదీరిన గణనాథుడి సందర్శనకు రేపు మధ్యాహ్నం నుంచి అనుమతి ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. వినయక చవితి పర్వదినాన ఉదయం 9 గంటలకు గవర్నర్ నరసింహన్ తొలిపూజ చేయనున్నారు. విగ్రహ ప్రతిష్టాపనకు పూజను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు.

09/02/2016 - 16:36

హైదరాబాద్‌: నయీం కేసులో నలుగురు బాలికలను పోలీసులు రాజేంద్రనగర్‌ న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరిచారు. బాలికలను విడివిడిగా ప్రశ్నించి మెజిస్ట్రేట్‌ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం పోలీసులు వీరిని కస్తూర్భా ట్రస్టుకు తరలించారు. పుప్పాలగూడలోని నయీం ఇల్లును తనిఖీ చేసినప్పుడు నలుగురు బాలికలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నయీం కూతురు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

09/02/2016 - 16:12

హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా చాక్లెట్లు తయారుచేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో నగరంలోని మల్లేపల్లిలో లిక్కర్‌ చాక్లెట్ల తయారీ కేంద్రంపై ఎక్సైజ్‌ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. భారీగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో వందకు పైగా లిక్కర్‌ చాక్లెట్ల తయారీ కేంద్రాలకు నోటీసులు జారీచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

09/02/2016 - 14:47

హైదరాబాద్: గద్వాల జిల్లాను ఏర్పాటు చేసి వెనుకబడినవారిని గుర్తించాలని మాజీ మంత్రి డీకేఅరుణ శుక్రవారం డిమాండ్ చేశారు. చారిత్రకమైన నిర్ణయంలో చారిత్రక తప్పిదం చేయొద్దని, జిల్లాల విభజనతోనే టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. గద్వాల జిల్లా కోసం ఇందిరాపార్క్‌ వద్ద నిరాహారదీక్షకు దిగనున్నట్లు అరుణ తెలిపారు. నిరాహార దీక్ష పోస్టర్‌ను డీకే అరుణ, పొన్నాల విడుదల చేశారు.

09/02/2016 - 14:04

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీకి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం
చేరుకున్నారు. అనంతరం శిక్షణలో ఉన్న ఐపీఎస్‌లతో ఇష్టాగోష్టిలో పాల్గొంటారు. గ్రేహౌండ్స్‌ క్యాంపస్‌ను సందర్శిస్తారు. అకాడమీలో కొత్తగా నిర్మించిన భోజనశాలను రాజ్‌నాథ్‌ ప్రారంభించనున్నారు.

09/02/2016 - 21:48

నల్లగొండ, సెప్టెంబర్ 1: పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల పునరావాస, సహాయ చర్యల పూర్తి కోసం 115 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లుగా ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు.

09/02/2016 - 13:45

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భేటి-బచావో భేటి-పడావో పథకం ద్వారా పనె్నండో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు.

09/02/2016 - 12:36

శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్- గగన్ పహాడ్ వద్ద శుక్రవారం ఉదయం బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆరు ప్రైవేట్ బస్సులు సీజ్ చేసి, వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు.

09/02/2016 - 12:23

హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణ-వాణిలకు ఆపరేషన్ చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్లు సుముఖత వ్యక్తం చేశారు. వీణ-వాణిల రిపోర్టులను ఆస్ట్రేలియా వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన వీణా-వాణిలు ప్రస్తుతం నగరంలోని ఓ హోంలో ఉంటున్నారు. ఆపరేషన్ చేస్తే వీణా-వాణిలకు ప్రమాదముందనే వైద్యుల సూచనల మేరకు గతంలో ఆపరేషన్ ఆపివేశారు.

09/02/2016 - 11:56

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ కి చెందిన పాండు, కవిత అనే దంపతులకు వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామస్తులు వారి మృతదేహాలను చూసి కంటతడి పెట్టారు.

Pages