-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని, కాంగ్రెస్ను అణిచివేయాలని టీఆర్ఎస్ చూస్తోందని టీ. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ ఆరోపించారు. క్విట్ ఇండియా డే సందర్భంగా గాంధీభవన్లో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: మాజీ నక్సలైటు, గ్యాంగ్స్టర్ నరుూంకు 5 రాష్ట్రాల్లో సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేరకు ఆస్తులున్నట్టు పోలీసులు జరిపిన సోదాల్లో తేలింది. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో సోమవారం నరుూంను హతమార్చిన పోలీసులు ఆ తర్వాత అర్ధరాత్రి వరకూ వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిపారు.
హైదరాబాద్: ఇసుక లోడుతో అతివేగంగా వెళుతున్న టిప్పర్ ఓ ఆటోను ఢీకొనగా ఇద్దరు యువకులు మరణించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం గచ్చిబౌలి ఇంద్రానగర్ వద్ద జరిగింది. టిప్పర్ బలంగా ఢీకొనడంతో ఆటోలో వెళుతున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని, పరారైన టిప్పర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
మహబూబ్నగర్, ఆగస్టు 8: ప్రశాంతంగా ఉండే మిలీనియం టౌన్షిప్ తుపాకుల మోతతో అదిరిపోయింది. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తుల మాదిరిగా కొందరు పోలీస్లు మఫ్టీలో మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లోని మిలీనియం టౌన్షిప్లో షికార్లు చేశారు. మార్నింగ్ వాక్ చేస్తున్న టౌన్షిప్ వాసులు వీళ్లను పెద్దగా పట్టించుకోలేదు.
నల్లగొండ, ఆగస్టు 8: పోలీసుల అండతో హత్యలకు, సెటిల్మెంట్లకు పాల్పడి మాఫియా లీడర్గా ఎదిగిన మాజీ మావోయిస్టు నరుూం నేర ప్రస్థానం చివరకు పోలీసుల ఎన్కౌంటర్తోనే ముగిసింది. నరుూం పేరు వింటేనే భువనగిరితో పాటు నల్లగొండ, మహబూబ్నగర్, వరంగల్, హైద్రాబాద్లలో జనం వణికిపోయేంతంగా అతడు హత్యలకు పాల్పడుతూ మాఫియా లీడర్గా ఎదిగాడు. అతడిపై ఆయా జిల్లాల్లో 100 కేసులు, 21హత్య కేసులున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 8: పేరు మోసిన గ్యాంగ్స్టర్, మాజీ నక్సలైట్ నయాం ఎన్కౌంటర్ వెనుక అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన పరిణామాలే నయాం ఎన్కౌంటర్కు దారితీసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. నక్సల్స్, పౌరహక్కుల నేతలను చేతికి మట్టిఅంటకుండా మట్టుబెట్టడానికి పోలీసు బాసులకు నయాం పావుగా ఉపయోగపడేవాడన్న ఆరోపణలు ఉన్నాయి.
జహీరాబాద్, ఆగస్టు 8: హైదరాబాద్ బోరబండలోని నెహ్రూనగర్కు చెందిన రౌడీషీటర్ వాహెద్ (35) మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. అతని తమ్ముడు వసీం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హతుడికి అత్యంత సన్నిహితులైన ఫేరోజ్, యూసుఫ్, సయ్యద్, సర్వర్, అసద్, సలావుద్దీన్లే తన అన్నను హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశాడు.
షాద్నగర్, ఆగస్టు 8: మోస్ట్ వాంటెడ్గా..గ్యాంగ్స్టర్గా చలామణి అవుతున్న నరుూంను పోలీసులు హతమార్చిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నరుూం ముఠాకు చెందిన గుంటూరు జిల్లా వాసి బాషా గత ఏడాదిన్నర క్రితం షాద్నగర్లోని మిలీనియం టౌన్షిప్లో ఓ ఇంటిని కొన్నాడు.
రామన్నపేట, ఆగస్టు 8: నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలో ఆదివారం రాత్రి టిఆర్ఎస్ వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు, మంత్రి జగదీశ్వర్రెడ్డి బంధువు మందడి విద్యాసాగర్రెడ్డి ఇంటిపై పూస బాలకిషన్ వర్గానికి చెందిన కార్యకర్తలు మూకుమ్మడిగా దాడిచేసి విద్యాసాగర్రెడ్డితోపాటు, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టారు.
హైదరాబాద్, ఆగస్టు 8: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించడం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటీ? అని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రశ్నించారు.