-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
విజయవాడ, జూలై 25: పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన వైద్య పరికరాలతో పాటు మొబైల్ బృందాలు, అంబులెన్స్ సౌకర్యం, ఘాట్లలో భక్తులకు సూచనలను చేసే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. వైద్య సిబ్బందికి బ్లూస్కర్టు, వైట్ స్కార్ప్తో ప్రత్యేకమైన డ్రెస్కోడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మానవపాడు, జూలై 25: కర్నూల్ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్నూల్ పట్టణానికి చెందిన ఒక కుటుంబం తమ అల్లుడిని దుబాయి పంపించాలని ఆదివారం హైదరాబాద్కు వెళ్లి విమానం ఎక్కించి కారులో సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మానవపాడు-జల్లాపురం స్టేజీల మధ్యలో ముందుగా వెళ్తున్న లారీని వెనుకనుంచి వారి వాహనాన్ని ఢీకొంది.
వరంగల్: వరంగల్ సోమవారం రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. వాటర్ట్యాంకు పగలడంతో స్టేషన్లోకి నీరు వెల్లువెత్తింది. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు స్టేషన్ పక్క నుంచి వెళ్తున్న విద్యుత్ తీగల్లో కరెంటు సరఫరాను నిలిపివేశారు.
మెదక్: మల్లన్నసాగర్ నిర్వాసితులకు సంఘీభావంగా జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ టీడీపీ నేత రేవంత్రెడ్డిని, బీజేపీ స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ డిప్యూటీసీఎం దామోదర రాజనర్సింహను అరెస్ట్ చేసి గజ్వేల్ పోలీస్స్టేషన్కు తరలించారు. అరెస్ట్ సమయంలో టీడీపీ, ఇతర పక్షాలకు చెందిన కార్యకర్తలు-పోలీసులకు మధ్య కొద్దిసేపుట తోపులాట జరిగింది.
మెదక్: మల్లన్నసాగర్ నిర్వాసిత రైతులను కలవనీయకుండా తెరాస సర్కారు ఆంక్షలు విధించడం అన్యాయమని తెలంగాణ జెఎసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తనను అరెస్టు చేయడం బాధ కలిగించలేదని, రైతులపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. బాధిత రైతులను ఎక్కడికి వెళ్లనీయకుండా గ్రామాల్లో పోలీసులను కాపలా పెట్టడం మంచిది కాదన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్లే మల్లన్నసాగర్ జలాశయంపై రైతులు పోరాటాలకు దిగుతున్నారన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో ఆరు వర్సిటీలకు వైస్ చాన్సలర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు వర్సిటీకి డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, జెఎన్టియుకి వేణుగోపాలరెడ్డి, తెలంగాణ వర్సిటీకి సాంబశివరావు, కాకతీయ వర్సిటీకి సాయన్న, ఓయుకి రామచంద్రం, ఆర్జియుకెటికి సత్యనారాయణలను వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్: వైస్ చాన్సలర్ల నియామకాలకు సంబంధించిన కేసు విచారణలో ఉండగా ఆరు విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించడం ఏమిటని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ సర్కారుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లకు పైగా ఆగిన ప్రభుత్వం వీసీల నియామకంపై రెండు, మూడు రోజులు ఆగలేదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.
హైదరాబాద్: బంగారు గొలుసు ఇచ్చేయాలంటూ మెడపై కత్తిపెట్టి ఆగంతకుడు బెదిరించినా ఆ మహిళ ధైర్యం చూపింది. నగరంలోని అమీర్పేట కుమ్మరిబస్తీలో బైక్పై వచ్చిన ఓ చైన్ స్నాచర్ రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళను అడ్డగించాడు. ఆ మహిళ ప్రతిఘటించడంతో చైన్స్నాచర్ పలాయనం చిత్తగించాడు. పెనుగులాటలో మహిళ స్వల్పంగా గాయపడింది.
మహబూబ్నగర్: ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో ప్రభుత్వ నిధులను తెరాస సర్కారు కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని, కమీషన్లు దండుకుని మంత్రులు అక్రమంగా సంపాదిస్తున్నారని బిజెపి నేత నాగం జనార్దనరెడ్డి సోమవారం ఆరోపించారు. అవినీతిని వెలికి తీసి ఆ మంత్రులను జైలుకు పంపుతానని ఆయన హెచ్చరించారు. అక్రమ సంపాదనపై తప్ప తెరాస మంత్రులకు అభివృద్ధి పథకాలపై ఆసక్తి లేదన్నారు.
హైదరాబాద్: ఫిలింనగర్లోని కల్చరల్ సెంటర్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన నేపథ్యంలో అధికారుల తీరుపై మున్సిపల్ మంత్రి కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపైనా కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.