S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/25/2016 - 08:21

కొత్తూరు, జూలై 24: ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతూ అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తోందని, వ్యవసాయ రంగంపై ఆధారపడిన మన దేశంలో నూతన వ్యవసాయ ఉత్పత్తులపై యువశాస్తవ్రేత్తలు దృష్టి కేంద్రీకరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పిలుపునిచ్చారు.

07/25/2016 - 08:20

నక్కలగుట్ట (వరంగల్), జూలై 24: తెలంగాణ సాహిత్యంలో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు తలమానికం లాంటివాడని తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రమైన వరంగల్‌లో అశోక కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం సన్నుతి పుస్తకావిష్కరణ సభ, ఆచార్య కోవెల సుప్రన్నాచార్య అశీతి పూర్తి అభినందన సభ జరిగింది.

07/25/2016 - 08:17

సంగారెడ్డి, జూలై 24: మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కేవలం ప్రతిష్టగా భావించి అమాయక రైతులపై దౌర్జన్యానికి దిగి, తప్పకుండా ప్రాజెక్టును కట్టితీరుతామంటూ లాఠీచార్జీ ద్వారా సంకేతాన్ని పంపిస్తోందని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు.

07/25/2016 - 07:23

హైదరాబాద్, జూలై 24: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయు) స్థాపించి వందేళ్లు పూర్తయన సందర్భంగా వచ్చే ఏడాది శతాబ్థి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాల్సిందిగా సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. శతాబ్థి ఉత్సవాల నిర్వహణకు ఇప్పటినుంచి సన్నద్ధం కావాలన్నారు.

07/25/2016 - 07:22

సిద్దిపేట/ కొండపాక, తొగుట: జూలై 24: మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఈ ప్రాజెక్టు వల్ల తాము భూములు కోల్పోతామనే ఆందోళనతో పెద్ద సంఖ్యలో ముంపునకు గురయ్యే గ్రామాల రైతులు ఆదివారం రాజీవ్ రహదారి ముట్టడికి బయలుదేరడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన కారులను వేములగాట్, ఎర్రవెళ్లి గ్రామాల్లో పోలీసులు చెదరగొట్టారు. ఎర్రవెళ్లి గ్రామంలో పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు.

07/25/2016 - 08:00

హైదరాబాద్/ ఖైరతాబాద్, జూలై 24: హైదరాబాద్ ఫిలింనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. శ్లాబ్‌తోపాటు 14 పిల్లర్లు నేలమట్టమయ్యాయి. ఆదివారం చోటుచేసుకున్న ప్రమాదంలో శిథిలాల కింద ఇద్దరు నలిగి మృతిచెందగా, 8మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించారు.

07/24/2016 - 18:15

హైదరాబాద్: ఫిలింనగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం, ఉద్యోగం ఇస్తామని క్లబ్ పేర్కొంది. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

07/24/2016 - 18:14

హైదరాబాద్: ఫిలిం నగర్‌లోని కల్చరల్ సెంటర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలి ఇద్దరు కూలీలు మరణించడంపై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. కల్చరల్ సెంటర్‌లోకి ప్రవేశించి అక్కడ తలుపులు, అద్దాలు, ఫర్నిచర్‌ను వారు ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి నాయకత్వంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

07/24/2016 - 18:14

హైదరాబాద్: నగరంలో పలుచోట్ల అనుమతుల్లేకుండా, నాసిరకం పనులతో భవన నిర్మాణాలు జరుగుతున్నాయని, కొందరు కాంట్రాక్టర్లు కూలీల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఫిలింనగర్‌లో ఆదివారం కుప్పకూలిన భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.

07/24/2016 - 17:37

ఖమ్మం : బకెట్‌ బాంబుల పేరుతో పోలీసులను మావోయిస్టులు పరుగులు పెట్టించారు. గత రాత్రి రామచంద్రాపురం సమీపంలో వర్రెవాగు వద్ద బకెట్లు పెట్టి వాటిలో బాంబులు ఉన్నాయని చెప్పడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. భద్రాచలం-వెంకటాపురం ప్రధాన రహదారిమీద భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.ఆగి ఉన్న బస్పుకు కూడా ఒక బకెట్‌ తగిలించి ఈ నెల 28న జరిగే మావోయిస్టుల వారోత్సవాలను విజయవంతం చేయాలని నినాదాలు ఇచ్చారు.

Pages