S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/26/2016 - 05:56

హైదరాబాద్, జూలై 25 : తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దళితులు ముందుకు వస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి టి-ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇన్‌క్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్యూనర్స్) పేరు పెట్టారు. దళితులకు ప్రోత్సాహకాలు అందించేందుకు వీలుగా సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

07/26/2016 - 05:55

హైదరాబాద్, జూలై 25 : తెలగాణ రాష్ట్రంలోని ఫెర్రోఅల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ రాయితీని కొనసాగించాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు చైర్మన్‌గా ఏర్పాటైన ఐదుగురు మంత్రులతో కూడిన ఉపసంఘం పలుదఫాలుగా సమావేశమై ఈ అంశంపై సమీక్షించింది. ఉపసంఘంలో వాణిజ్యపన్నులు, పంచాయితీరాజ్, విద్యుత్తు, ఆర్థిక శాఖల మంత్రులు సభ్యులుగా ఉన్నారు.

07/26/2016 - 05:54

హైదరాబాద్, జూలై 25: ఇందిరా క్రాంతి పథం (ఐకెపి) సిబ్బందికి వేతనాలు (పారితోషకం) పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐకెపి సిబ్బందికి పారితోషకాన్ని పెంచే ప్రతిపాదనను పంపించాలని సిఎం కెసిఆర్ సోమవారం ఆదేశించారు. తమ సర్వీసులను కూడా కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరిగా క్రమబద్ధీకరించాలని ఐకెపి సిబ్బంది ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

07/26/2016 - 05:54

హైదరాబాద్, జూలై 25: విద్యార్థుల సమస్యలపై ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్ తెలిపారు.

,
07/26/2016 - 04:15

నల్లగొండ, జూలై 25: జిల్లాలో ఆగస్టు 12 నుండి 23 వరకు జరుగనున్న కృష్ణా నది పుష్కరాల సందర్భంగా నది పరీవాహకం వెంట ఉన్న ప్రసిద్ధ ఆలయాలకు పుష్కర హంగులద్దాలన్న సర్కార్ యోచన సకాలంలో సిద్ధించడం కష్టతరంగా కనిపిస్తోంది. కృష్ణా పుష్కర స్నానాల అనంతరం భక్తులు దగ్గర్లో ఉన్న దేవాలయాలను దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతారు.

07/26/2016 - 04:08

బేగంపేట, జూలై 25: సకాలంలో వర్షాలు కురుస్తాయని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తనకు సంతృప్తినిస్తున్నాయని సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి రంగం కార్యక్రమంలో అవివాహిత స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. ఆషాఢమాసం బోనాల జాతరలో భాగంగా సికిందరాబాద్ బోనాల సందడి రెండోరోజు కూడా కొనసాగింది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించిపోయారు.

07/26/2016 - 04:01

కరీంనగర్ టౌన్, జూలై 25: తరాల తరబడి తాము భూమిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఎవుసం చేసుకుంటూ వచ్చిన ఆదాయంతోనే జీవనం కొనసాగిస్తున్నాం..మెట్ట ప్రజలకోసం తమ గ్రామాల్లోప్రాజెక్టులు కడుతున్నామంటే సంతోషించాం...నీటినిల్వ కోసం భూమి కావాలంటే సాగులేకున్నా సరే తోటి రైతులకే లాభం కల్గుతుందనే భావనతోభూములిచ్చాం. ఇచ్చిన కాడికే పరిహారం తీసుకున్నాం.

07/26/2016 - 03:55

విజయవాడ, జూలై 25: తెలంగాణ రాష్ట్రంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకున్న నిర్వాసితులపై ప్రభుత్వం నిరంకుశంగా దాడులకు పాల్పడటం అన్యాయమని, ఈ దాడుల్లో 28 మంది తీవ్రంగా గాయపడగా, ఒక మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలిపారు. ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన ప్రజల్ని అదుపు చేసేందుకు గాలిలోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.

07/26/2016 - 03:55

తిరుమల, జూలై 25: కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడలో టిటిడి ఏర్పాటుచేస్తున్న శ్రీవారి నమూనా ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నాలుగంచెల విధానంతో దర్శనం కల్పించనున్నట్లు తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు తెలిపారు. కృష్ణాపుష్కరాల్లో టిటిడి చేపడుతున్న ఏర్పాట్లకు సంబంధించి ఆయన తిరుమలలో అన్నదానం, ఆరోగ్యవిభాగం, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.

07/26/2016 - 03:54

వేములవాడ, జూలై 25: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయం వెనకభాగంలోని చెట్ల పోదలలో సోమవారం ఉదయం హత్యకు గురైన ఒక యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వేములవాడ సిఐ శ్రీనివాస్ కథనం ప్రకారం వివరాలు ఇలాఉన్నాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆ ప్రదేశంలో గుర్తు తెలియని యువతి మృతదేహం పడిఉందనే సమాచారంతో సంఘటనా స్థలానికి వెల్లి సదరు యువతి మృతదేహాన్ని పరిశీలించామన్నారు.

Pages