-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మనె్నగూడ సమీపంలో సోమవారం ఉదయం ఓ కారు బోల్తాపడి ఇద్దరు మరణించారు. నగరంలోని ఫలక్నుమా ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కర్ణాటకకు వెళ్లి తిరిగి వస్తుండగా కారులో ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా, సలీముద్దీన్ అనే ఇద్దరు యువకులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉట్నూరు, జనవరి 3: పాలకులు, ప్రభుత్వాలు మారినా గిరిజనుల చట్టాలు మాత్రం దేశంలో ఎక్కడా అమలు జరగడంలేదని, అన్నిరంగాల్లో దారిద్రాన్ని అనుభవిస్తున్న ఆదివాసీ గిరిజనులు హక్కుల పరిరక్షణ, స్వయంపాలన కోసం ఉద్యమాలబాట పట్టాలని త్రిపుర మాజీమంత్రి, పార్లమెంట్ సభ్యులు జితిన్ చౌదరి పిలుపునిచ్చారు.
వరంగల్, జనవరి 3: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, కేంద్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి నితిన్గడ్కరీ నేడు (సోమవారం) వరంగల్కు రానున్నారు. రూ.1905 కోట్లతో యాదాద్రి నుండి వరంగల్ వరకు నిర్మించనున్న నాలుగు లైన్ల జాతీయ రహదారి పనులకు వారు శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటే ఏటూరునాగారం గోదావరి తీరాన నిర్మామై ఉన్న ముళ్లకట్ట బ్రిడ్జిని వారు మడికొండ వద్దే జాతికి అంకితం చేయనున్నారు.
నిజామాబాద్, జనవరి 3: కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని, ఈ తరహా కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడతామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్ పేర్కొన్నారు.
గజ్వేల్/ములుగు, జనవరి 3: రైతుల సంక్షేమానికి టిఆర్ఎస్ సర్కార్ కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లా ములుగు సమీపంలో ఈ నెల 7న ఉద్యానవన యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన సందర్భంగా ఆయన మట్లాడారు.
వరంగల్, జనవరి 3: ప్రముఖ రచయిత, కవి బండారు సదాశివరావు తన జాతీయవాద రచనలతో సమాజాన్ని ప్రభావితం చేశారని చారిత్రక నవలా చక్రవర్తి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య ముదిగొండ శివప్రసాద్ అన్నారు.
దేవరకొండ/హాలియా/మోత్కూర్, జనవరి 3: నల్లగొండ జిల్లాలో ఆదివారం నలుగురు రైతులు, వరంగల్ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడగా, నల్లగొండ జిల్లాలో వ్యవసాయబావి వద్ద మోటార్ను పెట్టేందుకు వెళ్ళి విద్యు దాఘాతానికి గురై ఒక మహిళా రైతు మరణించింది.
భద్రాచలం, జనవరి 3: ఖమ్మం జిల్లా భద్రాచలం వేదికగా తలపెట్టిన రాష్టస్థ్రాయి యువజనోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర రాజధాని వెలుపల జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి 950 మంది యువ కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
చేర్యాల, జనవరి 3: రాష్ట్రంలోనే ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని, కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. దేవాలయ ప్రాంగణంలోని తోట బావి వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్ద కల్యాణం జరుగగా ప్రభుత్వం తరపున డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
హైదరాబాద్, జనవరి 3: ఉమ్మడి రాజధానిలోని రాజకీయవర్గాలే గాక, సామాన్య ప్రజలు సైతం ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం జారీ అయ్యే అవకాశాలున్నాయి. మధ్యాహ్నమే 150 ఎన్నికల డివిజన్ల రిజర్వేషన్లను, సాయంత్రం అయిదు గంటల్లోపు నోటిఫికేషన్ జారీ చేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.