S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/15/2020 - 00:28

హైదరాబాద్, జనవరి 14: ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలుచేయాలని తెలంగాణ టీచర్సు ఫెడరేషన్ డిమాండ్ చేసింది. 2018 మే 16న సీఎం ఉపాధ్యాయ సంఘాలతో ఐదున్నర గంటల పాటు ప్రగతి భవన్‌లో చర్చించారని, తర్వాత మరో రెండు గంటల పాటు మీడియా సమావేశం పెట్టి అనేక అంశాలను ప్రస్తావించారని, అవేవీ నేటికీ అమలుకు నోచుకోలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు.

01/15/2020 - 00:28

హైదరాబాద్, జనవరి 14: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్ధులు ఖరారయ్యారని, కనుక ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరగడానికి ఎన్నికల అధికారులు పూర్తిగా తమకున్న అధికారాలను సద్వినియోగం చేసుకోలని అన్నారు. ఓటర్ల స్వేచ్ఛను హరించడానికి రకరకాల పద్ధతులతో ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని అన్నారు.

01/15/2020 - 00:27

హైదరాబాద్, జనవరి 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో జరుగుతున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ రెండో రోజు మంగళవారం నేత్రపర్వంగా కొనసాగింది. ఈ ఫెస్టివల్ బుధవారంతో ముగియనున్నది. ప్రారంభ రోజు కైట్ ఫెస్టివల్‌ను తిలకించడానికి వచ్చిన వారితో పోల్చిచూస్తే రెండో రోజు నగర వాసులు భారీగా తరలివచ్చారు. ఇందులో యువతి యువకులు అధికంగా ఉన్నారు.

01/15/2020 - 00:15

హైదరాబాద్: హైదరాబాద్ గోషామహాల్ నియోజకవర్గం శాసనసభ్యుడు రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. చలో బైంసా పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యేను గృహనిర్బంధం చేశారు. రాజాసింగ్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బైంసా ఘటనకు నిరసనగా ఈరోజు నిర్మల్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీ, కమిషనర్‌లను పోలీసు శాఖ అప్రమత్తం చేసింది.

01/15/2020 - 00:11

హైదరాబాద్, జనవరి 14: రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల ‘బరి’ లో మిగిలింది దాదాపు 18 వేల మందిగా తేలింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా మంగళవారం రాత్రి వరకు పూర్తి వివరాలను విడుదల చేయలేదు. రాజకీయ పరంగా మినహా అధికారికంగా ఎన్నికల కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.

01/14/2020 - 16:20

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో సంక్రాంతి సంబరాలను ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పతంగులను ఎగురువేశారు. కార్యాలయాన్ని అందమైన రంగవల్లులతో ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్సీలు..

01/14/2020 - 05:25

హైదరాబాద్, జనవరి 13: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల సమయంలో ప్రతి అంశంపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఆయన జిల్లా యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

01/14/2020 - 05:23

హైదరాబాద్, జనవరి 13: మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామగ్రామానికి గంగమ్మ తల్లిని తీసుకువచ్చిన విధంగానే ప్రతి గ్రామంలో విద్యాజ్యోతిని వెలిగించాల్సిన అవసరముందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఆయన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు సూచించారు.

01/14/2020 - 05:21

హైదరాబాద్, జనవరి 13: కాలుష్య నివారణ కోసం తీసుకున్న చర్యలు, అమలు తీరు, ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదికను జనవరి 31 వరకు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. ఈనెల 31న ఎన్‌జీటీ సమావేశం జరుగుతోందని, ఈ సమావేశంలో చర్చించే అంశాలపై కూలంకషంగా సమీక్షించారు.

01/14/2020 - 05:15

హైదరాబాద్, జనవరి 13: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ రాజకీయ చెలగాటం కోసమేనని, వారేమీ ప్రజాసమస్యల పరిష్కారానికి సమావేశం కాలేదని బీజేపీ తీవ్రంగా స్పందించింది. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ సోమవారం పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు.

Pages