-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 13: ‘బీజేపీ అంటే మాకు భయమా? అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు పోయినందుకా? మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకనందుకా? ఆ పార్టీకి ఏం బలముందని భయపడాలి?’ అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఎద్దేవా చేశారు.
భైంసా రూరల్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కర్ఫ్యూను సడలించామని వెల్లడించారు. ప్రజలు సహితం ఒక్క దగ్గర గుంపులు గుంపులుగా నిలబడవద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
భైంసా రూరల్, జనవరి 13: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కొరవగల్లీలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారి భారీ విధ్వంసానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. కొరవగల్లీలో ఒక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు ద్విచక్ర వాహనానికి సైలెన్సర్ను తొలగించి పెద్ద శబ్దంతో వేగంగా నడుపుతుండడంతో సదరు వాహనదారునితో కాలనీ వాసులకు ఘర్షణ జరిగింది.
భైంసా రూరల్: తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ రాంచందర్రావు అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం రాత్రి విధ్వంస ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు భైంసాకు వచ్చిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఐజీ ముందు ప్రవేశపెట్టారు.
హైదరాబాద్, జనవరి 12: పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని జమ్మూ కాశ్మీర్ సహా దేశవ్యాప్తంగా ఇది అమలులో ఉందని కేంద్ర అల్పసంఖ్యాక వర్గాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఆదివారం ఇక్కడ నెక్లెస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన హస్తకళల ప్రదర్శన హాత్ను ఆయన ప్రారంభించారు.
సికిందరాబాద్, జనవరి 12: పండుగ జరుపుకోవడం కోసం పల్లెలకు వెళ్లే ప్రయాణికులతో సికిందరాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టాండ్లు కిక్కిరిసిపోయాయి. సోమవారం నుంచి తెలంగాణలోని అనేక విద్యాసంస్థలు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో తమతమ సొంత గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం కోసం పిల్లాపాపలతో సకుటుంబ సపరివారంతో శనివారం ఉదయం నుంచే రైల్వే స్టేషన్లకు, బస్టాండ్కు చేరుకున్నారు.
హైదరాబాద్: భారతీయ రైల్వేలో ఆదాయంలో ముందున్న దక్షిణ మధ్య రైల్వేలో (సికింద్రాబాద్) అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రతి ఏడాది జోన్లో ఆరు డివిజన్లలో వేల కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, గుంతకల్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం డివిజన్లు ఉన్నాయి.
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో తాజా సమాచారం ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధికంగా నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ మినహా మిగతా తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 3052 వార్డులు ఉండగా 25,768 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదివారం ఇక్కడ ప్రకటించింది. వీటిలో 432 నామినేషన్లను తిరస్కరించగా, 25,336 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్, జనవరి 12: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్థాయిని పెంచడం వల్ల తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని, ఈ విషయమై ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలని కాంగ్రెస్ సీఎం కేసీఆర్ను డిమాండ్ చేసింది.
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అసెంబ్లీ, జడ్పీపీ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని, అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగురువేస్తుందని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్, జడ్పీ చైర్మన్ పుట్టా మధు అన్నారు. ఆదివారం ఇక్కడ వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విపక్ష పార్టీలకు అభ్యర్థులు కరవయ్యారన్నారు.