S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
స్పాట్ లైట్
ఫిలిప్పీన్స్లోని మాయోన్ అగ్ని పర్వతం ఎప్పుడు విస్ఫోటనం చెందినా చుట్టుపక్కల ప్రాంతాల్లో అలజడి చెలరేగుతుంది.
ఈ అగ్నిపర్వతం లావాను వెదజల్లుతూ నిప్పులు చెరగడం అన్నది నిత్యకృత్యమే. దీనికి సమీపంలోని ఓ టూరిస్టు కేంద్రంలో గుమికూడిన జనం ఈ అగ్నిపర్వత విస్ఫోటనాన్ని, అది వెదజల్లు తున్న లావా, ధూళిని ఆసక్తిగా గమనిస్తున్న దృశ్యమిది.
ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడిలో మరణించినవారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ కెనడాలోని క్యూబెక్ నగరంలో మృతుల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రజలు. ఓ పక్క ప్రపంచ దేశాలు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కెనడాలోని ఈ పట్టణంలోని ఓ మసీదులోకి ఆగంతకుడు చొరబడి మారణకాండ సృష్టించడం సర్వత్రా దిగ్భ్రాంతిని రేకెత్తించింది.
ఒక దేశ అంతర్గత శక్తి యుక్తి అన్నది అంతర్జాతీయ వేదికలపై అది అనుసరించే వ్యూహం, విధానాలను బట్టి ఆధారపడి ఉంటాయి. కేంద్రంలో మోదీ సారథ్యంలో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు దేశాలతోపాటు సంపన్న దేశాలు, మధ్య స్థాయి దేశాలతో బలమైన, స్థిరమైన మైత్రీబంధాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు గట్టిగానే జరిగాయి.
బంగ్లాదేశ్, మైన్మార్ల మధ్య కుదిరిన ఒప్పందం ఎప్పుడు అమలవుతుందోగాని వేలాదిమంది రోహింగ్యా మైనారిటీ ముస్లింల పరిస్థితి దినదిన గండం చందంగానే మారింది. మైన్మార్ సైనిక దళాల దాడుల నుంచి తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తోచిన దారిలో పరుగులు పెట్టిన రోహింగ్యాలు బంగ్లాదేశ్లోనే ఆశ్రయం పొందారు.
డోక్లామ్ వివాదానికి ఆజ్యం పోసినట్టే చైనా సీపెక్ ప్రాజెక్టును చేపట్టింది. సిక్కిం, భూటాన్, చైనా సరిహద్దుల్లో చైనా రోడ్డు మార్గ నిర్మాణాన్ని చేపట్టింది. ఆ రోడ్డు పూర్తయితే మన దేశానికి సైనికపరంగా అత్యంత కీలకమైన ప్రదేశం కావడంతో మున్ముందు సిలిగురి కారిడార్పై కూడా చైనా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది
భిన్న రకాలకు చెందిన అమెరికా మహిళలు సమానత్వం, సామరస్యం, వివక్ష నిర్మూలనపై దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు జరిపారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో జరిగిన పరిణామాలను, వర్గ వర్ణ వ్యతిరేక ధోరణులను నిరసించారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వివక్షను గర్హిస్తూ మహిళలు లక్షలాది సంఖ్యలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ట్రంప్ విధానాలపట్ల మహిళల్లో గూడు కట్టుకున్న వ్యతిరేకత మరింతగా బయటపడింది.
నేటి వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు ప్రాచీన మూలం వస్తు మార్పిడి. బార్టర్ వ్యవస్థగా పేర్కొనే ఈ విధానం శతాబ్దాలుగా భారత్ అంతా విస్తరించి ఉంది. వ్యాపార వాణిజ్యాల్లో ఆధునికత పెరిగినా ఈ ప్రాచీన విధానం చాలాచోట్ల ఇంకా అమలులోనే ఉంది. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో స్థానికులు ఈ వస్తు మార్పిడి విధానానే్న ఇప్పటికీ అనుసరిస్తున్నారు.
అంతర్జాతీయంగా రాణిస్తున్న భారత్ నిన్న ప్యారిస్.. నేడు దావోస్
బ్రెగ్జిట్పై టోరీల నుంచే సెగలు ఐరోపా యూనియన్ షరతులపై నిరసనలు
లేబర్ పార్టీని చుట్టుముడుతున్న సమస్యలు బ్రిటన్లో వేడి తగ్గని రాజకీయం
పెద్దన్న పాత్ర పోషిస్తూ, ప్రపంచాన్ని తమ ఆదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని ఎపుడూ ప్రయత్నించే అమెరికా మరోమారు చిన్నబోయింది.అమెరికా ప్రభుత్వం అధికారికంగా మూతపడింది. అమెరికా పాలనా యంత్రాంగాన్ని నడిపేందుకు అవసరమైన ఖర్చులను నిర్ధేశించే ద్రవ్యవినిమయ బిల్లును సెనేట్ తిరస్కరించడంతో షట్డౌన్ మొదలైంది. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డోనాల్డ్ ట్రంప్కు ఇది ఇబ్బందికరమై పరిస్థితే.