S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 04:21

రాజమహేంద్రవరం, ఆగస్టు 4: గోదావరి నది వరద ఉద్ధృతి పెరిగింది..గోదావరి ప్రవాహం పెరిగి వడివడిగా సముద్రంలోకి మళ్లుతోంది భక్త జనం అదే ఉరవడిలో అంత్య పుష్కర స్నానాలకు తరలివచ్చారు. అంత్య పుష్కరం గురువారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్ధేశించిన అన్ని ఘాట్లలో సుమారు ఐదు లక్షల మంది వరకు పుష్కర స్నానాలు ఆచరించారు.

08/05/2016 - 04:19

నెల్లూరు, ఆగస్టు 4: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన యువభేరి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలన్నారు.

08/05/2016 - 04:15

దుమ్ముగూడెం, ఆగస్టు 4: గిరిజన ప్రాంతానికి చెందిన ఓ నిండు గర్భిణిని కాపాడేందుకు భర్త, స్థానికులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగుతో పోరాడి గెలిచిన సంఘటన ఇది. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం పైడాగులమడుగు గ్రామానికి చెందిన గొంది లక్ష్మి అనే గర్భిణికి బుధవారం అర్థరాత్రి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఆశావర్కర్లు, కుటుంబ సభ్యులు కలిసి ఆటోలో పర్ణశాల పిహెచ్‌సీకి బయలుదేరారు.

08/05/2016 - 04:12

హైదరాబాద్, ఆగస్టు 4: ఇప్పటివరకు దేశంలో తాము పర్యటించిన రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే పరిశ్రమలు, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని యునైటెడ్ కింగ్‌డమ్ బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. ఈ బృందం ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావును గురువారం కలిసింది.

08/05/2016 - 03:58

హైదరాబాద్, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్రంలోని వివిధ బార్ అసోసియేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు 5వ తేదీ శుక్రవారం హైకోర్టు విధులకు హాజరు కాకూడదని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు నిర్ణయించారు. ఏపి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఉల్లంఘించి ఆంధ్రప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని తెలిపారు.

08/05/2016 - 03:57

హైదరాబాద్, ఆగస్టు 4: సికింద్రాబాద్‌లోని సదరన్ రీజియన్ ఎన్టీపిసి సంస్థ చేపట్టిన జూనియర్ మజ్దూర్ ఉద్యోగాల భర్తీపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్‌లో ఎన్టీపిసి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సి అరవిందరావు పిటిషన్ దాఖలు చేశారు.

08/05/2016 - 03:57

హైదరాబాద్, ఆగస్టు 4: వచ్చే 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్న ప్రధాన నరేంద్రమోదీ సంకల్పానికి, కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలకు మద్దతు తెలుపుతున్నట్లు అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) ప్రకటించింది.

08/05/2016 - 03:56

హైదరాబాద్, ఆగస్టు 4: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వౌలానా అబుల్‌కలాం అజాద్ సుజల స్రవంతి స్కీం పేరు మార్చి మిషన్ భగీరథ పేరును పెట్టారని, ఈ స్కీంను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. మిషన్ భగీరథ ప్రారంభానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దూరంగా ఉండాలని టిపిసిసి సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, టి జగ్గారెడ్డి, మల్లు రవి ప్రధానిని కోరారు.

08/05/2016 - 03:55

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలపై చర్చించారు. తెలుగు దేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, లోక్‌సభలో పార్టీ పక్షం నాయకుడు తోట నరసింహం, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

08/05/2016 - 03:54

సంగారెడ్డి, ఆగస్టు 4: రెండేళ్లు నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో చరిత్రలో ఎన్నడు లేని విధంగా సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా వట్టిపోగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతోంది. వడివడిగా వస్తున్న వరదతో 6.23 టిఎంసిలకు నీరు నిల్వకొచ్చింది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల ద్వారా మంజీర నదిలోకి వరద నీరు వస్తోంది.

Pages