S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 03:02

విశాఖపట్నం, ఆగస్టు 4: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా అక్కడే కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. ఉత్తర ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

,
08/05/2016 - 03:00

హైదరాబాద్, ఆగస్టు 4: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పదవీకాలాన్ని పొడిగిస్తారా? లేక తాజాగా గుజరాత్ సీఎం పదవికి రాజీనామా చేసిన ఆనందీ బెన్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రోశయ్య పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఆయనకు పొడిగింపు ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం జయలలిత మోదీని కోరారన్న ప్రచారం తమిళ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

08/05/2016 - 02:59

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ జల వనరుల సమాచార వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి, ఇస్రోకు మధ్య అవగాహనా ఒప్పందం రేపు కుదురనుంది. ఆరవ తేదీన ఉదయం 8.30కి మంత్రి హరీశ్‌రావు, ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్‌ల సమక్షంలో ఎంఓయు కుదురుతుంది.

08/05/2016 - 02:59

హైదరాబాద్, ఆగస్టు 4: హైదరాబాద్‌లో విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి 32 ఎల్‌ఎస్‌డి బ్లాట్స్, రూ. 11వేల నగదుతోపాటు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

,
08/05/2016 - 02:48

న్యూఢిల్లీ, ఆగస్టు 4: అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలను రద్దు చేయడంపై, ఈ వ్యవహారంలో గవర్నర్లు నిర్వహించిన పాత్రపై గురువారం రాజ్యసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

,
08/05/2016 - 02:43

మహద్, ఆగస్టు 4: ముంబయి-గోవా రహదారిపై వంతెన కూలిపోయిన ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం జుడీషియల్ విచారణకు ఆదేశించింది. బ్రిటీష్ కాలంనాటి వంతెన కొట్టుకుపోయి 22 మంది మృతిచెందారు. రెండు ప్రయాణికుల బస్సులు వరద నీట్లో కొట్టుకుపోయాయి. రాజధాని ముంబయికి 170 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సావిత్రి నదిపై ఉన్న పురాతన వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది.

08/05/2016 - 02:40

న్యూఢిల్లీ, ఆగస్టు 4: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) చట్టాన్ని అమలులోకి తెస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఖచ్చితంగా చెప్పిన నేపథ్యంలో అందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మరో పక్క ఈ బిల్లును ఆమోదించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు.

08/05/2016 - 02:38

ఇస్లామాబాద్: భారత్-పాక్ సంబంధాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న విభేదాలు సార్క్ హోం మంత్రుల స్థాయి సమావేశాల్లో సైతం బయటపడ్డాయ. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పాక్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీ ముఖాముఖి ఎదురుబడినప్పుడు ఎడమొఖం పెడమొఖంగా కనిపించారు. సమావేశం జరుగుతున్న సెరేనా హోటల్ వద్దకు రాజ్‌నాథ్ చేరుకున్నప్పుడు చౌదరి గేట్ వద్ద ఉన్నారు.

08/05/2016 - 02:38

న్యూఢిల్లీ, ఆగస్టు 4: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతున్న సార్క్ దేశాల మంత్రుల స్థాయి సమావేశంలో గురువారం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగాన్ని మొత్తం మీడియా బహిష్కరించిందంటూ (బ్లాక్ అవుట్) వచ్చిన వార్తలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

08/05/2016 - 02:35

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పోలీసు వ్యవస్థపై లెఫ్టినెంట్ గవర్నర్ పెత్తనంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి భంగపడింది. దేశ రాజధానిలో శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను తగ్గించలేనని కోర్టు తేల్చిచెప్పింది.

Pages