S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 03:53

ఖమ్మం, ఆగస్టు 4: మద్యాన్ని దుకాణాలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్టవ్య్రాప్తంగా కొత్తగా ఐదు మద్యం డిపోలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల పరిధిలో ఇప్పటికే 17మద్యం డిపోలు ఉండగా, కొత్తగా మరో 5ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలోనే కొత్త డిపోలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.

08/05/2016 - 03:53

జిన్నారం, ఆగస్టు 4: మెదక్ జిల్లా ఐడిఎ బొల్లారంలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న ఓ కుంటుంబాన్ని సజీవ దహనానికి యత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రస్తుతం బాధితులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానికుల కధనం ప్రకారం... ఐడిఎ బొల్లారం గ్రామానికి చెందిన సుంకయ్య కుటుంబం బొల్లారం నివాసం వుంటున్నారు.

08/05/2016 - 03:45

న్యూఢిల్లీ, ఆగస్టు4: తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని టిఆర్‌ఎస్ ఎంపీ కవిత వెల్లడించారు. గురువారం పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీని ఆమె కలిశారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ పసుపుబోర్డు కోసం ఎంతోకాలంగా రైతులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. దీనిపై తాను ఇంతకు ముందే కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే ఉన్నతాధికారులతోనూ పలు దఫాలుగా చర్చించినట్టు కవిత వెల్లడించారు.

08/05/2016 - 03:35

గుంటూరు, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మరో మూడు కీలక విభాగాలను తరలించారు. ఇప్పటి వరకు ఐదు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. గురువారం రెండో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పురపాలకశాఖ మంత్రి పి నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి ఎంపి కన్నబాబు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనూరాధ తమ చాంబర్లను ప్రారంభించారు.

08/05/2016 - 03:27

న్యూఢిల్లీ, ఆగస్టు 4: అత్యంత వివాదాస్పదంగా మారిన రాష్ట్ర హైకోర్టు విభజన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందా? చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఠాకూర్‌ను కలిసి కృష్టా పుష్కరాల ఆహ్వానం అందజేసినప్పుడు హైకోర్టు విభజన అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది.

08/05/2016 - 03:18

ప్రత్తిపాడు, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ సమస్యగా మారిన ప్రత్యేక హోదాపై కేంద్రానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ సిద్ధం కావాలని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. ఆమరణ దీక్షకు సిద్ధపడితే వారితోపాటుగా వారి ఇంట్లో దీక్షకు చోటు కల్పిస్తే తాను కూడా దీక్షలో కూర్చుంటానన్నారు.

,
08/05/2016 - 03:12

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారిగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ ఈనెల ఏడవ తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆగస్టు 7 ప్రపంచ స్నేహితుల దినోత్సవం. అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం.

08/05/2016 - 03:09

హైదరాబాద్, ఆగస్టు 4: ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీకేజి కేసులో సిఐడి మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అరెస్టయ్యారు. మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన గుడిపల్లి చంద్రశేఖర్ రెడ్డి (37) హైదరాబాద్ మోతినగర్‌కు చెందిన షేక్ షాకీరా (29)ను సిఐడి అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.

08/05/2016 - 03:08

న్యూఢిల్లీ,ఆగస్టు 4: కాళేశ్వరం, మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాధితుల సమస్యలు వివరించేందుకు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ది పథకాలను ప్రారంభించేందకు నరేంద్ర మోదీ తెలంగాణకు వెళుతున్న విషయం తెలిసిందే.

08/05/2016 - 03:05

గుంటూరు, ఆగస్టు 4: పుష్కర స్నానం.. ఓ పవిత్రమైనదిగా ప్రజలు భావించాలని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ ఉద్ఘాటించారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఆలపించిన కృష్ణా పుష్కర స్వాగత గీతం సీడీని గురువారం గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురూజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భక్తుల నుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.

Pages