-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విశాఖ: హోలీ సందర్భంగా రంగులు చల్లుకుని సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లిన ఆరుగురిలో ఇద్దరు యువకులు గల్లంతైన సంఘటన బుధవారం విశాఖ బీచ్లో జరిగింది. యువకులు నీట మునగడంతో స్థానికులు వెంటనే స్పందించి నలుగురిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన ఇద్దరి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నెల్లూరు: ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో బుధవారం జరిగింది. స్థానికులు ఈ ముగ్గురినీ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. తీవ్ర గాయాల కారణంగా ముగ్గురూ మరణించారని పోలీసులు తెలిపారు.
విశాఖ: హోలీ ఉత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం నగరంలో బైక్లపై వీరవిహారం చేసిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కొంతమంది యువతులను కూడా పోలీసులు పట్టుకుని బైక్రైడింగ్కు కేసులు పెట్టారు.
విజయవాడ: ఇక్కడి ప్రకాశం బ్యారేజీ వద్ద బుధవారం ఉదయం పసిపాపతో పాటు ఓ తల్లి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. నర్సాపురానికి చెందిన దుర్గ్భావాని అందరూ చూస్తుండగానే శిశువును ఎత్తుకుని నదిలోకి దూకింది. ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది నదిలో గాలించి మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
గుంటూరు: హోలీ పండగ సందర్భంగా నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద కృష్ణానది వద్ద బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. స్నానం చేసేందుకు ఆరుగురు యువకులు నదిలోకి వెళ్లగా ముగ్గురు ఆచూకీలేకుండా పోయారు. మిగతా ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ముగ్గురు యువకులు మరణించడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.
విశాఖ: చింతపల్లి మండలం కృష్ణాపురం వద్ద బుధవారం ఉదయం ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడగా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.
అనంతపురం: ప్రియురాలి గొంతు కోసి ప్రియుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కదిరి మండలం మూర్తిపల్లెలో బుధవారం వెలుగు చూసింది. ప్రియురాలు మరణించగా, ప్రియుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్: ప్రాజెక్టు కట్టిందొకరైతే ఆ ప్రాజెక్టులోని నీళ్లిచ్చే లష్కర్ మరొకరని వైకాపా నేత జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు.
విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్ జలాశయానికి మంగళవారం 14,872 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. నాగార్జున సాగర్ కుడికాలువకు మంచినీటి అవసరాల కోసం జలాల విడుదలపై సందిగ్ధం కొనసాగుతోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల మంచినీటి అవసరాల నిమిత్తం 4.5 టీఎంసీల నీటిని శ్రీశైలం నుండి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డును కోరింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో సామాన్యులకు రుసుము, పన్ను లేకుండా ఇసుక పంపిణీ చేసేందుకు కొత్త ఇసుక విధానాన్ని చేపట్టామని గనుల మంత్రి పీతల సుజాత తెలిపారు. శాసనమండలిలో బుధవారం వైకాపా సభ్యుడు ఆదిరెడ్డి అప్పారావు తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ఈ విధానానికి సంబంధించి మార్గదర్శకాలు, విధి విధానాలు ఖరారు చేస్తున్నామన్నారు.