S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/03/2016 - 00:50

న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశీయ ఔషధరంగ దిగ్గజం లుపిన్‌కు చెందిన జపాన్ అనుబంధ సంస్థ క్యోవా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ.. జపాన్‌కు చెందిన షియనోజి అండ్ కో నుంచి 21 ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఓ ఒప్పందం కూడా కుదిరింది. సుమారు వెయ్యి కోట్ల రూపాయల (15.4 బిలియన్ యెన్లు)కు సదరు ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతోంది.

08/03/2016 - 00:50

హైదరాబాద్, ఆగస్టు 2: పరిశ్రమల్లో ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు వెబ్ ఆధారిత మోటార్ టూల్‌ను ఇండస్ నెట్ టెక్నాలజీస్ రూపొందించినట్లు ఆ సంస్థ సిఇఒ అభిషేక్ రుంగ్టా మంగళవారం తెలిపారు. అలాగే విద్యుత్ మోటార్ డ్రైవర్ సిస్టమ్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు వినియోగించే మోటార్ టూల్‌ను ఇ-క్యూబ్ ఎనర్జీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

08/03/2016 - 00:48

హైదరాబాద్, ఆగస్టు 2: వాణిజ్యం, ఎగుమతులకు సంబంధించిన వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు ప్రారంభించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా టియోటియా వెల్లడించారు. మంగళవారం ఆస్కిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పరిశ్రమల శాఖ సీనియర్ అధికారులతో రీటా చర్చించారు.

08/03/2016 - 00:44

విశాఖపట్నం, ఆగస్టు 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2016-17)కి సంబంధించి 770 కోట్ల రూపాయల మేర టర్నోవర్‌ను లక్ష్యంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ) నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో డిసిఐ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్, డిసిఐ సిఎండి రాజీవ్ త్రిపాఠీ సంతకాలు చేశారు.

08/03/2016 - 00:44

విశాఖపట్నం, ఆగస్టు 2: విశాఖ జిల్లాలోని వివిధ ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉన్నట్లు వెల్లడైంది. దాదా పు 17 పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని సేఫ్టీ ఆడిట్‌లో గుర్తించారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో పారిశ్రామిక ప్రమాదాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

08/02/2016 - 01:19

న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశీయ ఐటిరంగ సంస్థ టెక్ మహీంద్ర ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 28 శాతం పెరిగి 796 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికంలో 622 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆదాయం ఈసారి 6,920.93 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 6,293.82 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం సంస్థ తెలిపింది.

08/02/2016 - 01:19

లండన్, ఆగస్టు 1: పన్నులు, వడ్డీ మదింపులకు ముందు లాభం ఈ జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో దాదాపు 3,439 కోట్ల రూపాయలు (527.1 మిలియన్ డాలర్లు)గా నమోదైనట్లు వేదాంత రిసోర్సెస్ సోమవారం తెలిపింది. నిరుడుతో పోల్చితే ఇది 18 శాతం తక్కువని, పోయినసారి 644.6 మిలియన్ డాలర్లుగా ఉందని చెప్పింది. ఆదాయం తగ్గడమే లాభాల్లో క్షీణతకు కారణమని పేర్కొంది.

08/02/2016 - 05:18

దేశీయ అతిపెద్ద మార్ట్‌గేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి..సోమవారం లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మసాలా లేదా రూపాయ బాండ్ల ద్వారా 30 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. భారత్‌లో కాకుండా విదేశాల్లో మసాలా బాండ్లు జారీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఎక్స్‌చేంజ్ వద్ద హెచ్‌డిఎఫ్‌సి ప్రతినిధుల ఆనందోత్సాహం

08/02/2016 - 01:16

సోమవారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సరికొత్త రాడో వాచీలను
సంస్థ ప్రతినిధులతో కలిసి మార్కెట్‌కు పరిచయం చేస్తున్న
బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్

08/02/2016 - 01:14

చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం లెనోవా సోమవారం భారతీయ మార్కెట్‌లోకి తమ వైబ్ కె నోట్ సిరీస్‌లో 5వ ఎడిషన్‌ను విడుదల చేసింది.
వైబ్ కె5 నోట్‌గా పరిచయమైన దీని ధర 11,999 రూపాయలు

Pages