S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/02/2020 - 23:16

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః....తస్మైశ్రీ గురవేనమః - అని గురువును త్రిమూర్తి రూపంగా ఆరాధించే సంప్రదాయం గల భూమి మనది. గురుశిష్య పరంపరతో యుగయుగాలుగా ఈ భరత ఖండం వర్ధిల్లుతోంది. వీరిరువురి మధ్యగల సంబంధం ఎంతో పవిత్రమైనది. శుభకరమైనది. కాని నేడు ఈగురుశిష్య పరంపరకు మచ్చలేర్పడుతున్నవి. యుగప్రభావమో లేక పాపప్రేరిపితమో గాని నేడు ఈ గురుశిష్య బంధం పూర్తి వ్యాపారాత్మకంగాను, లోప భూయిష్టంగాను మారుతోంది.

01/30/2020 - 22:39

బృహజ్ఞాతకము, బృహత్పఠాశరహోర, సారావళి, హోరాసార, జాతక పారిజాతము, జాతక మార్తాండ కాళిదాసు ఉత్తరకాలామృతం మొదలగునవి. ఇంత చేసినా 50 శాతం శాస్తమ్రు, 40 శాతం అతీంద్రియ జ్ఞానముపై ఫలిత నిర్దేశము వుంటుంది. ఎంతోమంది జ్యోతిష్యవేత్తలు చెప్పే ఫలితాలు జరుగుటలేదు. బి.వి.రామన్ శతాధిక గ్రంథకర్త ఆస్ట్రాలజికల్ మాగజైన్‌లో ఇలా వ్రాశారు.
‘్ఫలానిగ్రహచారణ సూచయన్తి మనీషిణాః

01/30/2020 - 22:36

సాధారణంగా వారు వీరు అనే తేడా ల్లేకుండా చూసినా రామ అనని వారుండరు . అలాంటి రామ అనే శబ్దానికి నిలువెత్తు రూపం ధరించి దశరథునికి పెద్ద కొడుకుగా నలుగురన్నదమ్ముల మధ్య రాముడు కౌసల్యా తనయుడై పుట్టాడు. కాలక్రమంలో రాముడు మా దేవుడు అనే వారు కలియుగంలో వచ్చారు.

01/30/2020 - 22:34

ఎక్కడ రామనామం వినపడుతుంటుందో అక్కడ అర్థనిమీలిత నేత్రుడై శిరస్సు వంచి చేతులు జోడించి రామనామంలో పారవశ్యం చెందుతూ నేటికీ దర్శనమిచ్చే యోధానుయోధుడు మన హనుమంతుడు. ఆ అంజనీసుతుని జీవితంలోని ప్రతి ఘట్టమూ చూస్తే అభ్యాసం చేసి నేర్చుకోవలసిన పాఠ్యభాగమే అనిపిస్తోంది.

01/29/2020 - 22:33

సత్యం అహింస మొక్కవోని
పట్టుదలే జీవనాధారంగా చేసుకో
బాపుకన్న కలలన్నీ
సమూహమై సాకారం చేసుకో
బాపూ ఓ అఖండ జ్యోతి
విశ్వమే ఆ వెలుగులో దేదీప్యమానవౌతోంది
బాపు ఓ ఆలోచన
జగమంతా ఉద్విగ్న భరితమై కదులుతోంది
బాపు దార్శనికతే
మనదై మమేకమై భారతీయతను విస్తరించు
దృక్కులన్నీ ఆ వైపుకే
బాపుజీ చూపిన దారుల వైపే
కదం తొక్కు తూ వడివడిగా అడుగులు

01/29/2020 - 22:32

జ్యోతిష్యమనగా జ్యోతిష్యుల యొక్క శాస్తమ్రు. జ్యోతిః అనగా ఆకసమందు జ్యోతించెడివి. అనగా ప్రకాశించేవి. వీటిని తెలుసుకొనుట వలన త్రుటికాలము మొదలుకొని బ్రహ్మకల్ప పర్యంతంగల కాల భేదములు కొలుచుటకును, ఇంకను ప్రపంచంలో వున్న జీవులకు వెలుగు మొదలైనవి కలుగజేయుటకు, గ్రహ నక్షత్ర మండలములు ఈశ్వరునిచే ప్రసాదించబడినవి.

01/28/2020 - 22:39

ఏది ధర్మము ఏది అధర్మమో తెలుసుకోవాలి. అప్పుడుకూడా ధర్మసూక్ష్మం తెలుసుకునే ఏపనినైనా ఆచరించాలి. లేకుంటే భగవత్పరితం చేయాలి. అంటే పని చేసేటపుడు తాను కేవలం నిమిత్తమాత్రుడని అనుకొంటే అధర్మభయం అంటదు అని అంటారు. కానీ అందరూ నేనే చేస్తున్నాను పని అనుకొంటారు. దానితోనే ఈ తంటా వస్తుంది.

01/28/2020 - 22:38

సనాతన ధర్మం అంటే సనాతనం అంటే శాశ్వతము ప్రస్తుతము మతంగా కొనసాగుతున్న హిందూ ధర్మంలో విగ్రహరాధన ప్రత్యేక విశిష్టతను సంతరించుకొన్నది. విశ్వవ్యాప్తమైన మహాచైతన్యమే మన ముందు ఉన్నదనే భావనతో భగవంతుడిగా నామకరణం చేసికొని స్ర్తి, పురుషరూపాలలో, విగ్రహారాధన చేస్తారు హిందువులు. విగ్రసాన్ని మలచి అట్టి విగ్రహశక్తిని యంత్ర రూపంలో ఉంచి విశేషమంత్ర శక్తిని ధారపోసి వేదోక్తముగా ప్రాణప్రతిష్ట చేయుట జరుగుచున్నది.

01/27/2020 - 22:42

మనిషికి అంతశ్శుద్ధి, బాహ్య శుద్ధి కావాలంటారు పెద్దలు. శివనామాన్ని నోటితో జపిస్తే అటు మనస్సు శుద్ధి అవుతుంది. నదీస్నానం లాంటివి ఆచరించినపుడు శరీరం శుద్ధి అవుతుంది. ఏపని చేసినా అది ఈశ్వరార్పణాబుద్ధితో చేస్తే భగవంతునికి ప్రీతి పాత్రులవుతారు. అటువంటి వారు సజ్జనులు, మహానుభావులు అని కీర్తింప బడుతారు. ప్రతివారు ఈ ఈశ్వరార్పణ బుద్ధిని ప్రతినిముషమూ ధరించి ఉండలేరు.

01/27/2020 - 22:38

భగవంతున్ని చేరడానికి వున్న అనేకానేక దారులలో భక్తి ఒకటి. భక్త్భివనలో పూజ, నామస్తోత్రం, జపం లాంటివిసాధనాలుగా ఉంటాయ. కొందరు భక్తులు కీర్తనలు ఆలపిస్తూ వారికిష్టమైన పాటలు పాడుతూ భగవంతుని గొప్పతనాన్ని స్మరిస్తూకూడా భక్తిని వెలువరిస్తారు. ఆ భగవంతుని గూర్చిన పాటల్లోనే వారు తాద్యాత్మం చెందే వారు ఉన్నారు. భగవంతుడిని ఏది కోరినా దానిని ఇస్తాడు.

Pages