S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మహబూబ్నగర్టౌన్, జూలై 2: మహబూబ్నగర్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు పార్టీలకు అతీయితంగా ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ కోరారు. శనివారం పట్టణంలోని బ్రహ్మణవాడి, రాంనగర్ వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బోరును ప్రారంభించారు.
మహబూబ్నగర్, జూలై 2: ముఖ్యమంత్రి కెసిఆర్ దౌర్జన్యానికి దిగుతున్నాడని ఆయన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని భయం పట్టుకుందని అందుకే టిఆర్ఎస్ చిల్లరగాళ్లతో దౌర్జన్యాలు చేయిస్తున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్థన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్, జూలై 2: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, హెల్మెట్ వాడకంపై చైతన్యం తీసుకవచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రవాణాశాఖ, ఆర్టీసి తదితర శాఖలతో జిల్లాకలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతప్రమాదాల నివారణపై సమీక్షించి, పలు సూచనలు జారీ చేశారు.
కుప్పం, జూలై 2: ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోగల కంగుంది పంచాయతీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకుంది. పాలారు నదిపై చెక్డ్యామ్ల ఎత్తు తగ్గించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఆదిలాబాద్, జూలై 2: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ వాడకంపై ప్రజల్లో చైతన్యం తీసుకవచ్చేందుకు పెట్రోల్ బంక్ యజమానులు పూర్తిగా సహకరించాలని, ఇందుకోసం జిల్లాలో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోసేందుకు యజమానులు కఠిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు.
ఆదిలాబాద్, జూలై 2: జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశాన్ని ఈనెల 11న నిరహిస్తున్నట్లు జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
శ్రీకాళహస్తి, జూలై 2: రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న భూ సేకరణపై అసెంబ్లీలో పోరాటం చేస్తామని వైకాపా శాసనసభాపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. శనివారం ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరు జిల్లా పర్యటనకు వెళుతూ శ్రీ శ్రీకాళహస్తిలో ఎపి సీడ్స్ కూడలిలో కొద్దిసేపు ఆగారు.
విజయవాడ, జూలై 2: ఈ ఏడాది రాష్టవ్య్రాప్తంగా 83 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలుగా అందించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎపి ప్రభుత్వం రూ.1,65,538తో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసింది.
విశాఖపట్నం (కల్చరల్), జూలై 2 : బ్రాహ్మణులు రాజకీయాల్లో అడుగుపెట్టి తమను తాము నిరూపించుకోవాలని ఆంధ్రా బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్, విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఐవై ఆర్ కృష్ణారావు అభిలషించారు. రాజకీయాల్లో తమ వాటాను అడిగి తీసుకోవాలని, తద్వారా పురోగతి సాధించవచ్చన్నారు.
‘‘వేదవతీ! వేగంగా నిద్ర లేవమ్మా. ఆడపిల్ల పొద్దెక్కే వరకూ నిద్రపోకూడదు’’ అనసూయమ్మ కోడల్ని నిద్ర లేపుతోంది.
‘‘అవునే తల్లీ! ఆడపిల్ల బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోతే ఆ ఇంటికి అరిష్టం’’ అనసూయమ్మ అత్త ఆండాలమ్మ పిలుపు.
‘‘కొత్త కోడలు కదా! ఆ మాత్రం మొద్దునిద్ర తప్పదు కాసేపు నిద్రపోనివ్వండి’’ ఆండాలమ్మ భర్త ముక్తాయింపు.