S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 06:32

న్యూఢిల్లీ, జూలై 2: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో భారతీయ యువతి తరుషి మృతి చెందడం తనకు ఎంతో బాధ కలిగించిందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ఒక ట్వీట్‌లో తెలిపారు. ఆమె తండ్రి సంజీవ్ జైన్‌తో తాను మాట్లాడానని, మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశానని ఆమె తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో దేశం యావత్తు ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు.

07/03/2016 - 06:31

నిజామాబాద్, జూలై 2: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితాలో కొనసాగుతున్న నిజామాబాద్ జిల్లాలో ఐఎస్‌ఐ కదలికలపై ఇటీవలి కాలంలో పోలీసు వర్గాల నిఘా సన్నగిల్లినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఏ మూలన, ఎలాంటి తీవ్రవాద సంఘటన జరిగినా దాని వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిజామాబాద్ జిల్లాకు సంబంధాలు ఉన్నట్టు అనేక సందర్భాల్లో వెల్లడైంది.

07/03/2016 - 06:31

హైదరాబాద్, జూలై 2: తెలంగాణలోని గ్రామాల్లో వేస్తున్న అంతర్గత పైప్‌లైన్లతోనే ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ వేయాలని ఆర్‌డబ్ల్యుయస్ ఇఎన్‌సి బి సురేందర్‌రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి అవసరమైన డక్ట్‌లను కొనుగోలు చేయాలని వర్క్ ఏజెన్సీలకు సూచించారు. మిషన్ భగీరథ పనులపై అన్ని జిల్లాల ఎస్‌ఇలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/03/2016 - 06:30

నల్లగొండ టౌన్, జూలై 2: రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో గత పది సంవత్సరాల నుండి పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పని లేదంటూ మార్చి నెల నుండి తొలగించినందునా వారంతా వారి కుటుంబాలతోపాటు రోడ్డున పడ్డారని, వారిని ఇతర శాఖలలో సర్దుబాటు చేసి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ శనివారం జిల్లా పరిషత్ ఆవరణలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ కార్పోరేషన్ ఔట్ సోర్సింగ్ ఎంప్లయిస్ యూనియన్

07/03/2016 - 06:30

హైదరాబాద్/ చార్మినార్, జూలై 2: ‘మా హైకోర్టు మాకు కావాలి.. దాన్ని సాధించుకునే వరకు పోరాడుతాం. న్యాయమైన మా నాలుగు డిమాండ్లను సాధించుకునే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, ఎంపీలు మా వెంటే ఉన్నారు. అవసరమైతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ధ ధర్నా చేస్తాం. పార్లమెంటునైనా ముట్టడిస్తాం..’ అని రిటైర్డ్ జడ్జిలు, న్యాయవాదుల జెఎసి ప్రతినిధులు అన్నారు.

07/03/2016 - 06:27

విశాఖపట్నం, జూలై 2: విజయవాడలో హిందూ దేవాలయాలను రాత్రికి రాత్రే కూల్చివేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టం అని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. రుషీకేష్‌లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న స్వామి శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. దేవాలయాల నిర్మాణమైనా, వాటిని తొలగించాలన్నా ఆగమశాస్త్రం ప్రకారమే జరగాలన్నారు.

07/03/2016 - 06:27

చౌటుప్పల్, జూలై 2: కాంగ్రెస్ పార్టీ అదిష్టానానికి పిసిసి ఛీఫ్ ఉత్తమ్ నాయకత్వంపై విశ్వాసముందని 2019వరకు పిసిసి నాయకత్వ మార్పు ఉండబోదని రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్‌లో విలేఖరులతో మాట్లాడుతూ 2019వరకు పిసిసి ఛీఫ్ పదవిపై ఆశపెట్టుకున్న వారికి భంగపాటు తప్పదంటూ పరోక్షంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు తేల్చి చెప్పారు.

07/03/2016 - 06:25

హైదరాబాద్, జూలై 2: హైకోర్టు విభజనపై చీఫ్ జస్టిస్‌తో చర్చిస్తానని గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చారని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయాధికారుల సస్పెన్షన్‌ను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరానని చెప్పారు.

07/03/2016 - 06:25

నల్లగొండ రూరల్, జూలై 2: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజుల నుండి వర్షాలు అడపదడపా కురుస్తుండడంతో నల్లగొండ మండలంలో ఖరీఫ్ పంటల సాగు ఊపందుకుంది. వర్షాధార పంటలైన పత్తి తదితరలు ఆనవాయితిగా వేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు మోటార్లు ఎండిపోయి వరి ధాన్యం పంట విస్తీర్ణం తగ్గిపోతుంది.

07/03/2016 - 06:24

నల్లగొండ, జూలై 2: కరవు, పర్యావరణ సమస్యలను దూరం చేసి సమాజంలోని అందరి భవిష్యత్‌ను పరిరక్షించేందుకు తెలంగాణలో అడవుల విస్తీర్ణం 25శాతం నుండి 33శాతం పెంచేందుకు సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం హరిత హారం కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు.

Pages