నల్గొండ
అమరుల స్ఫూర్తితో అభివృద్ధి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పండుగలను తలపించాయి. భారతదేశ స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోనిర్వహించిన వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు, అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్య్రదినోత్సవ వేడుకలలో గొంగిడి సునితతోపాటు కలెక్టర్ అనితారామచంద్రన్, ఎంఎల్సి ఎలిమినేటి క్రిష్ణారెడ్డి, భువనగిరి ఎంఎల్ఎ పైళ్లశేఖర్రెడ్డి, మునుగోడు ఎంఎల్ఎ కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, డిసిపి పాలకుర్తి యాదగిరి, జెసి రవినాయక్, డిఆర్ఒ మహేందర్రెడ్డి, డిఆర్డిఎ వెంకట్రావ్, వివిద శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా గొంగిడి సునిత ప్రసంగిస్తు ఎందరోమహానుభావులైన స్వాతంత్ర సమరయోదులు, తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగానె స్వేచ్ఛావాయువులను అనుభవిస్తున్నామని అన్నారు. వారి స్ఫూర్తితోనే బంగారు తెలంగాణాను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషిచేస్తున్నదని ఆమె తెలిపారు.