నల్గొండ

కల్లూరులో తెరాస, కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు పలకరింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, అక్టోబర్ 22: రాష్ట్ర మహిళ కాంగ్రెస్‌నేత జగదాంబ సభ్యులను పరామర్శించడానికి వేర్వేరుగా వచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిలు ఒకేచోట కలిశారు. వీరిరువురు సూర్యాపేట నియోజకవర్గానికి ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలైనప్పటికి కల్లూరు గ్రామంలో ఇరువురు కలవగా ఒకరినొకరు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.
వరికి మద్దతు ధర కల్పించాలి
నల్లగొండ టౌన్, అక్టోబర్ 22: వరికి మద్ధతు ధర కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పెరిక వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని చందనపల్లి గ్రామంలో ఐకెపి కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఐకెపి కేంద్రంలో ధాన్యం పోసి 20 రోజులవుతున్నా నేటికీ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతపల్లి బాలకృష్ణ, రాములుయాదవ్, రమేష్, శివాజి, సందీప్, మల్లయ్య, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.