నల్గొండ

ప్రణయ్ హంతకులను కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 17: సభ్య సమాజం తలదించుకునేలా పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్‌ను కుల, ధన దురహంకారులు, దుర్మార్గులు హత్య చేశారని కాంగ్రేస్ పార్టీ నాయకులు, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. సోమవారం నాడు దుండగుల చేతిలో ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రణయ్‌కుమార్ ఇంటికి వచ్చి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, తల్లిదండ్రులు హేమలత, బాలస్వామి, భార్య అమృతవర్షిణిలను పరామర్శించారు. ప్రణయ్ అహంకారుల చేతిలో హతమవడం దారుణమన్నారు. ప్రేమ జంటను దుర్మార్గులు ఇలా విడగొట్టారన్నారు. అన్యోన్యంగా ఉన్న దంపతుల జీవితాలను నాశనం చేసిన వారిని తీవ్రాతితీవ్రమైన శిక్ష విధించాలని కోరారు. ఆయన వెంట మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముండ్లగిరి కాంతయ్య, ఏడుకొండలు, జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, కౌన్సిలర్ పి.సుశీలజోజి, పత్తిపాటి నవాబ్, నాయకులు సాయమ్మలున్నారు.