నల్గొండ

ఆర్టీసీ బస్సు లారీ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, జూలై 1: హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారిపై మండలంలోని చీకటిగూడెం స్టేజీవద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది బస్సు ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్-1 డిపోకు చెందిన ఆర్టీసి బస్సు(నెంబరు ఎపి 29జెడ్ 3385) డీలక్స్‌బస్సు హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తుండగా చీకటిగూడెం శివారులోని పవర్‌ఫ్లాంటువద్ద ముందు వెళ్తున్న లారీని అధిగమించే క్రమంలో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈప్రమాదంలో బస్సులో ప్రయాణీస్తున్న ఆర్టీసి డ్రైవర్ మేకల మల్లేశంకు రెండుకాళ్లు, చేతులు విరిగిపోగా ప్రయాణీకులు భవానీదేవి, ఉదయ్‌కుమార్, సుమన్, కనకదుర్గ, హరికుమార్, నర్సింగరావులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108, ఎన్‌హెచ్‌ఎఐ 1033అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు కేతేపల్లి ఎస్‌ఐ కె.కిషన్ తెలిపారు.