నల్గొండ

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దవూర, జూలై 29: పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి పంచాయతీ పరిధిలోని డెక్కెలతండాలో శుక్రవారం జరిగింది. తండాకు చెందిన బాణావత్ జాను పొలంలో కలుపు తీయడానికి భార్య, కుమారుడితోపాటు అదే తండాకు చెందిన మరో ఇద్దరు కూలీలను కూలీకి తీసుకెళ్లాడు. కలుపుతీస్తుండగా సాయంత్రం సమయంలో చిన్నపాటి వర్షం రావడంతో వర్షానికి తడవకుండా ఉండేందుకుగాను పత్తిచేనులోని చెట్టుకిందికి వెళ్లారు. ఈ క్రమంలో చెట్టుపై పిడుగుపడి జాను కుమారుడు బాణావత్ సక్రు (16) అక్కడికక్కడే మృతిచెందగా కూలీకి వచ్చి రాత్లా జ్యోతి (22) చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. జానుకు తీవ్రగాయాలు కాగా మరో కూలి రమావత్ సింస్లికి స్వల్పగాయాలు అయ్యాయి.