నల్గొండ

అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, ఆగస్టు 1: నల్లగొండ పట్టణం అలకాపురికాలని వాసి కానిస్టేబుల్ బజ్జూరి రమేష్(34) సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని రైలు ఢీ కొట్టడంతో మృతి చెందినట్లుగా రైల్వే ఎస్‌ఐ జానకిరాములు తెలిపారు. రైలు పట్టాల సమీపంలోని తన ఇంటి నుండి రమేష్ బహిర్భూమి కోసం పట్టాల దాటుతున్న క్రమంలో రైలు ఢీ కొని మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. రమేష్ దేహానికి రైలు నడుం చివరి భాగంలో తగిలిన మేరకు అతడు పట్టాలు దాటుతు రైలు రాకను గమనించకపోవడంతోనే ప్రమాదానికి గురై మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. రమేష్ ఆత్మహత్య చేసుకునేంత కారణాలు ఏమి లేవని ప్రమాదవశాత్తు రైలు ఢీ కొనడంతో మరణించి ఉంటాడని కుటుంబ సభ్యులు, తండ్రి లింగయ్య తెలిపారు. మృతుడు రమేష్ చండూర్ మండల పోలీస్ స్టేషన్ సిఐ రమేష్‌కు గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సెలవుపై ఇంటికి వచ్చిన సందర్భంలో అతను రైలు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు రమేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.