విశాఖపట్నం

ఎస్సీ,ఎస్టీ బాధితులను వినతుల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు పలు వినతులు అందాయి. గురువారం ఇక్కడి ప్రభుత్వ అతిథిగృహంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ పాల్గొని ఎస్సీ,ఎస్టీలకు సంబందించిన సమస్యలు చర్చించారు. జాయింట్ కలెక్టర్ శివశంకర్ ఈ సందర్భంగా ఇతర అధికారులతో ఎస్సీ,ఎస్టీలకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. వీటిలో ఎక్కువుగా గాజువాక ప్రాంతంలో ఎస్సీ,ఎస్టీల భూ సమస్యలు ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించి సొంతదారులకు భూములు ఇప్పించాలన్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌డీఓ పెంచల కిషోర్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయప్రకాష్, పోలీసు అధికారులు, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు పారిపిల్లి రామారావు, రాష్ట్ర ఎస్సీ మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మి, విజిలెన్స్ మానిటరీ మెంబర్ ఏ తలపాక సుజాత, తదితరులు పాల్గొన్నారు.