విశాఖపట్నం

16 నుంచి పది సప్లిమెంటరీ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జూన్ 10: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీపరీక్షలను ఈ నెల 16 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ యువరాజ్ తెలిపారు. ఈ పరీక్షలను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. బార్‌కోడింగ్ విధానం అమల్లో ఉన్నందున ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. జిల్లాలో పదోతరగతి పరీక్షలకు 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతంలో 14, గ్రామీణ ప్రాంతంలో 7 పరీక్ష కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, హెచ్‌ఎంలను కలెక్టర్ ఆదేశించారు.