S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/14/2018 - 02:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నిక రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారికి అందజేసిన అఫిడవిట్‌లో ఫడ్నవీస్ తనపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలు వెల్లడించ లేదని అభియోగం. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో కేసులు వివరాలు దాచారని సతీష్ ఊకే బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.

12/14/2018 - 01:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: దేశంలోని ప్రతి జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమాల వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశంలో ఉన్న పది కోట్ల మంది వృద్ధుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని, వారి హక్కులను పరిరక్షించాలని కోర్టు పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని కూడా కోర్టు సూచ్చింది.

12/14/2018 - 01:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన నిర్భయ కేసులో మరణశిక్ష పడిన నలుగురు నిందితులకు వెంటనే శిక్షను అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు కొట్టివేసింది. ‘మేము వెంటనే ఢిల్లీ వెళ్లి వారికి ఉరి శిక్ష వేయాలా? ఎలాంటి విజ్ఞాపన మీరు చేస్తున్నారు?’ అని జస్టిస్‌లు మదనద్ బి లోకుర్, దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది.

12/14/2018 - 01:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: దేశాన్ని కుదిపేసిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించనుంది. ఫ్రాన్‌తో యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఒప్పందలో వేల కోట్లరూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 14న విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

12/14/2018 - 01:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: భారత ప్రభుత్వం 1982లో జమ్మూకాశ్మీర్‌లో ప్రవేశపెట్టిన పునరావాస చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఈ చట్టం కింద పాకిస్తాన్ నుంచి ఇక్కడకు వచ్చిన ఎంతమంది వలసదారులు దరఖాస్తు చేశారో వివరాలు తెలియజేయాలని ఆదేశించింది.

12/13/2018 - 22:49

రామచంద్రపురం, డిసెంబర్ 13: రామచంద్రపురం పట్టణంలో దొంగ నోట్లు మారకం చేస్తున్న ఒక వ్యక్తిని రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్ నేతృత్వంలో ఎస్సై ఎస్ లక్ష్మి తదితర సిబ్బంది పట్టుకోవడంతో తీగలాగితే డొంక కదిలినట్టు మరో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. అసలు నిందితుడు పరారీలో ఉన్నట్టు సీఐ శ్రీ్ధర్‌కుమార్ వివరించారు.

12/13/2018 - 22:39

డుంబ్రిగుడ, డిసెంబర్ 13: జీలుగుకల్లు సేవించడంలో తలెత్తిన వివాదం గిరిజనుడి హత్యకు దారితీసింది. ఇందుకు సంబంధించిన స్థానిక ఎస్.ఐ.కథనం ప్రకారం మండలంలోని కొర్రా పంచాయతీ పెదపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి గంగరాజు( 55) కించుమండ సంతబయలులో నివాసం ఉంటున్నాడు.

12/13/2018 - 04:12

పరిగి, డిసెంబర్ 12: నాయనమ్మలను సొంత మనవడు కొడవలితో నరికి హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా చన్‌గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పూడూరు మండలం చన్‌గోముల్ గ్రామానికి చెందిన శివకుమార్ ప్రతి రోజు తాగి వచ్చి ఇంట్లో నాయనమ్మలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. బుధవారం ఉదయం తాగిన మైకంలో నాయనమ్మ బుచ్చమ్మను, బాత్‌రూంలో ముఖం కడుగుతున్న చిన్న తాత భార్య చిన్న నాయనమ్మ అంతమ్మను కూడా కొడవలితో నరికాడు.

12/13/2018 - 02:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: గుజరాత్ నకిలీ ఎన్‌కౌంటర్ల కేసును విచారించిన సుప్రీంకోర్టు మాజీ జడ్జి తన నివేదికను ప్యానెల్‌లోని ఇతర సభ్యులతో పంచుకున్న విషయమై తెలియచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2002 నుంచి 2006 మధ్య గుజరాత్ ఎన్‌కౌంటర్లపై జస్టిస్ హెచ్‌ఎస్ బేడీ అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీ విచారించింది. 2002 నుంచి 2006 వరకు 26 నకిలీ ఎన్ కౌంటర్లని వచ్చిన అభియోగాలపై విచారణపై ఈ కమిటీ విచారించింది.

12/13/2018 - 02:19

చిత్రం..మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం బుధవారం ఉదయం రాంచీలోని సీబీఐ కోర్టుకు హాజరైన
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు ఖోడా

Pages