-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో కార్లను అద్దెకు తీసుకొని, అనంతరం వాటిని వైబ్సైట్ల ద్వారా ఇతరులకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ ఘరానా మోసగాడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసు వివరాలను పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ కేఎస్ రావు, సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.
కొందుర్గు, సెప్టెంబర్ 11: అక్రమంగా బ్లాస్టింగ్లు చేస్తున్న నలుగురు వ్యక్తులను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కొందుర్గు మండల కేంద్రం సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పేలుడు పదార్థాలను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్ ఎస్ఓటీ సీఐ ప్రవీణ్ రెడ్డి కథనం ప్రకారం.. మండల కేంద్రం సమీపంలో గోపాల్రెడ్డి అనే వ్యక్తి క్రషర్ పరిశ్రమను కొనసాగిస్తున్నారు.
ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: భార్య ప్రవర్తనపై విసుగుచెందిన భర్త రోకలి బండతో మోదీ హత్యచేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంచిలీపట్నానికి చెందిన ప్రశాంత్, జోత్స్నలు భార్యభర్తలు. అధిక సమయం సామాజిక మాధ్యమాలలో గడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న భార్య తీరును మార్చుకోవాలని పలుమార్లు సూచించినా మార్పు రాలేదు.
జీడిమెట్ల, సెప్టెంబర్ 11: పుట్టింటి నుంచి భార్య రావడం లేదన్న మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్లలో నివాసముండే వల్లెపు కృష్ణ (30) ఆటో డ్రైవర్. ఇతనికి 5 సంవత్సరాల క్రితం సావిత్రితో వివాహం జరిగింది. మూడు నెలలుగా సావిత్రి పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు.
వెల్దుర్తి, సెప్టెంబర్ 11: మండల కేంద్రమైన వెల్దుర్తిలోని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో మంగళవారం నాడు తెల్లవారు జామున ఓ అగంతకుడు బ్యాంకు వెనుక భాగంలో గల ఎగ్జాస్ట్ ఫ్యాన్ను తోలగించి అందులోకి దూరిన అగంతకుడు బ్యాంకులో గదులన్నీ తిరిగి దోచేందుకు ఏమీ కనిపించక పోవడంతో అగంతకుడు తిరిగి వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది.
వరంగల్ క్రైం, సెప్టెంబర్ 11: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని ధర్మసాగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారినుంచి రూ.5లక్షల రూపాయల విలువచేసే 160 గ్రాముల బంగారు అభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మాక్లూర్, సెప్టెంబర్ 11: మాక్లూర్ మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య మాటమాట పెరిగి, కత్తులు దూసుకునే స్థాయికి చేరుకుంది. విషయాన్ని పసిగట్టిన కొందరు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పెను ప్రమాదమే తప్పింది.
పెద్దవూరా, సెప్టెంబర్ 11: మండలంలోని పరివేదుల గ్రామ పంచాయతీ పరిధిలోని సుద్ధబావి తండాకు చెందిన రైతు రామావత్ శంకర్(28) క్రిమిసంహరక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కుటుంబ సభ్యులు సాగర్ కమలానెహ్రు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
దేవరకొండ, సెప్టెంబర్ 11: మండలంలోని తాటికోల్ గ్రామ వాగు నుండి ఇసుకను తరలించేందుకు వచ్చిన రెండు ఇటాచీలను మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాటికోల్ వాగు నుండి ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో గత రెండు నెలలుగా వాగు నుండి ఇసుకను తరలించేందుకు కాంట్రాక్టర్ ప్రయత్నం చేస్తున్నాడు.
ముదినేపల్లి, సెప్టెంబర్ 11: బ్రతుకు తెరువుకై ఊరుగాని ఊరు వచ్చి చేపల చెరువులో పడవపై మేత వేయడానికి వెళ్లి పడవ అదుపు తప్పి తిరగపడటంతో ఇద్దరు యువకులు మృతి చెందారు.