S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్వీన్ రీమేక్ సెట్స్లో హీరోయిన్ పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కన్నడ, తమిళ, మలయాళం తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ మైసూర్లో శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ స్పాట్లో పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. చిత్ర బృందం హీరోయిన్ కాజల్, తమన్నా పాల్గొన్నారు. తమిళ వర్షన్లో హీరోయిన్ కాజల్ ముఖ్య పాత్రలో నటిస్తోంది.
చూడగానే ఆకట్టుకునే లుక్ సూపర్స్టార్ మహేష్ సొంతం. మహేష్ తన లుక్లో పెద్దగా మార్పులు చేయడని అందరికీ తెలిసిందే. అతడు సినిమాలో హెయిర్ స్టైల్కి అతిథి సినిమాలో హెయిర్ స్టైల్ తప్పితే కెరీర్లో పెద్దగా తేడాలు కనిపించవు. కానీ మహేష్ ఎలా వున్నా చూసిన ప్రతిసారి అదే స్టైల్లో కనిపిస్తాడు. కానీ పైన వున్న ఫొటోని చూసి మొదటిసారి మహేష్ ఫాలోవర్స్ షాక్ అయ్యి ఉంటారని ఈజీగా చెప్పవచ్చు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం ‘పంతం’. గోపీచంద్ నటిస్తోన్న 25వ సినిమా ఇది. బలుపు, పవర్, జైలవకుశ చిత్రాలకు స్క్రీన్ప్లే రైటర్గా పనిచేసిన కె.చక్రవర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టీజర్ మంగళవారం విడుదలైంది.
1971లో భారత సరిహద్దుల్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా మలయాళంలో తెరకెక్కిన చిత్రం 1971 బియాండ్ బార్డర్స్. మేజర్ రవి దర్శకత్వం వహించారు. గత ఏడాది మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని జాష్రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ బేనర్స్పై ఎ.ఎన్.బాలాజీ ‘యుద్ధ్భూమి’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు.
ఆ మధ్య ఒక ఎమ్మెల్సీ టివీ చానల్ మైక్ ముందు నిల్చుని సినిమావాళ్ళు హోదా గోదాలోకి ఎందుకు దూకడం లేదని ప్రశ్నిస్తూ దుమ్మెత్తి పోశాడు.
ఈమధ్య ఒక ఎమ్మెల్యే, ఆయన సినిమా నిర్మాత కూడా నట. సినిమా వాళ్ళు హోదా ఉద్యమంలోకి ఎందుకు రావడం లేదు అంటూ నిలదీశాడు.
చిత్రం: విప్లవ నటుడు మాదాల రంగారావు ఇటీవల కన్నుమూసిన
విషయం తెలిసిందే. ఆయన సంస్మరణ సభ బుధవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సభలో చిత్రసీమకు చెందిన వారే కాక, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని మాదాల రంగారావుకు
ఘన నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ ‘జైలవకుశ’తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు బాబి కాస్త గ్యాప్ తీసుకుని క్రేజీ మల్టీస్టారర్ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. వెంకటేష్, నాగచైతన్యలు హీరోలుగా నటించే ఈ సినిమాకు ఇప్పటికే స్క్రిప్ట్వర్క్ పూర్తికావచ్చింది. ఈ సినిమాలో ఈ ఇద్దరు మామా అల్లుళ్లు కలిసి సేమ్ పాత్రలు పోషిస్తున్నారట. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకు వెంకీ మామ అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సైరా షూటింగ్లో బిజీగా వున్న మెగాస్టార్ చిరంజీవి, తన తదుపరి సినిమా కోసం డ్యూయెల్ రోల్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న మెగాస్టార్, మరోసారి రెండు పాత్రల్లో కనిపిస్తాడట. కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు మెగాస్టార్ ఓకె చెప్పిన విషయం తెలిసిందే. త్వరలోనే మొదలుకానున్న ఈ సినిమాలో రెండు పాత్రల్లో మెగాస్టార్ కనిపిస్తాడని టాక్.
తెలుగులో విభిన్నమైన సినిమాలతో అభిరుచిగల నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించారు. తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నానితో జెంటిల్మెన్ లాంటి సూపర్హిట్ సినిమాతో మళ్లీ నిర్మాతగా బిజీ అయ్యారు. తాజాగా అదే దర్శకుడితో సమ్మోహనం చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటించే సినిమాలో అవకాశం పట్టేసి లక్కీ గర్ల్గా మారింది నితిన్ హీరోయిన్ మేఘా ఆకాష్. లై సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రెండో సినిమా కూడా చల్ మోహన రంగ అంటూ నితిన్తోనే చేసింది. బాడ్లక్ ఏమిటంటే ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడికి కాస్త నిరాశ మిగిలింది. అందానికి అందం.. గ్లామర్.. చలాకితనం వున్న మేఘా ఆకాష్కి తాజాగా రజనీకాంత్ సినిమాలో నటించనుంది.