S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించే 25వ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 10 నుండి మొదలుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా అమెరికాలో షూటింగ్ మొదలుపెట్టి ఎక్కువ భాగం అక్కడే జరపాలని ప్లాన్ చేసారు.. అయితే ఎందుకో టీమ్ మళ్ళీ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు అమెరికాలో లొకేషన్స్ సెర్చ్ చేసాడు.
గ్లా మర్ ప్రపంచంలో మడికట్టుకుని కూచుంటే పనవ్వదు. ఈ విషయాన్ని వేగంగా గమనించే తెలుగమ్మాయిలు ఉన్నారు. ఎక్స్పోజింగ్లో ఏమాత్రం అడ్డు-ఆపూ లేకుండా చెలరేగిపోయి, వరుసగా సినిమాలకు సంతకాలు చేసిన నాయికలు ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళకు పూర్తివిభిన్నంగా కెరీర్ని ప్లాన్ చేసుకుంటోంది ఓ తెలుగమ్మాయ.
ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తి రేకెత్తిస్తున్న మల్టీ స్టారర్ రామ్చరణ్- ఎన్టీఆర్ లది. రామ్చరణ్ తేజ్, ఎన్టీఆర్లతో రాజవౌళి చేయబోతున్న మల్టీ స్టారర్ చిత్రంపై ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిందే. సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే అభిమానుల్లో సినిమా సందడి మొదలైపోయింది. ఇంకా రాజవౌళి పూర్తి కథను చరణ్, తారక్లకు చెప్పకముందే సినిమా కథకు సంబంధించి రకరకాల వార్తలు వినిపించాయి.
సాహసాల హీరో తెలుగు సినీ ఖ్యాతికి చెరగని చిరునామా. పద్మభూషణ్ డా.సూపర్స్టార్ కృష్ణ ‘తేనె మనసులు’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై అశేష ప్రేక్షకాభిమానాన్ని ఏర్పరచుకున్న నట శేఖరుడు. 50 సంవత్సరాలుగా అలుపెరుగని శ్రామికునిలా సినీ జగత్తులో 350 చిత్రాలకు పైగా నటించి సరికొత్త రికార్డులను నెలకొల్పడం సూపర్స్టార్ కృష్ణకే సాధ్యం. ఆయన 76వ జన్మదినోత్సవ వేడుకలు మే 31న హైదరాబాద్లో అట్టహాసంగా జరిగాయి.
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘పంతం’. ‘్ఫర్ ఎ కాస్’ అనేది ఉప శీర్షిక. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ నటిస్తోన్న 25వ చిత్రమిది. ఇందులో మెహరీస్ కథానాయికగా నటిస్తున్నారు. ‘బలుపు’, ‘పవర్’, ‘జై లవకుశ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రీన్ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
రియల్ లైఫ్లో కుదరకపోయినా... కనీసం రీల్ లైఫ్లో అయినా కొన్ని పాత్రల చేయాలనీ హీరోలు కోరుకుంటారు.. ఇప్పుడు అది సాయిధరమ్ విషయంలో నిజం కానుంది. అందుకు కారణం తాను కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించనున్న చిత్రం ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనుండడమే. నిజ జీవితంలో సాయిధరమ్ తేజ్ తండ్రి ప్రేమను చూరగొనలేదు. అందుకు కారణం చిన్నప్పుడే తన తల్లిదండ్రులు విడిపోవడం.
యశ్వంత్ మూవీస్ బ్యానర్పై తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఒరుముకతరై’ చిత్రాన్ని తెలుగులో ‘డాక్టర్ సత్యమూర్తి’గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల చేస్తున్నారు డి.వెంకటేష్.. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేష్ ఫిలిం ఛాంబర్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ముచ్చటించారు. రహమాన్ (రఘు) టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం తమిళనాడులో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రెజెంట్ జనరేషన్కు కనెక్ట్ అయ్యే స్టోరీ కనుక.
ఇండియన్ పీనల్ కోడ్లోని ఒక ముఖ్యమైన సెక్షన్ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథా చిత్రం ‘ఐపిసి సెక్షన్... భార్యాబంధు’ ‘సేవ్మెన్ ఫ్రమ్ ఉమెన్’ అన్నది స్లోగన్. దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన రెట్టడి శ్రీనివాస్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రం పాటలు విడుదల కార్యక్రమం జరిగింది.
యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్చేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ చిత్ర టైటిల్ను అధికారికంగా ప్రకటించబోతున్నారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనింతే’ చిత్రంలో కథానాయికగా నటించిన శియా గౌతమ్ ఎంతమందికి గుర్తుంది చెప్పండి. ఆ తర్వాత అమ్మడు ‘వేదం’ సినిమాలోనూ మనోజ్ బాజ్పాయ్ వైఫ్గానూ కనిపించింది. ఆ తర్వాత శియాగౌతమ్ మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. తర్వాత కొన్నాళ్ళకి చిన్న చిన్న ఈవెంట్స్లో కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు. అసలు ఈ అమ్మాయ్ ఎందుకని హీరోయిన్గా మళ్ళీ కనిపించలేదు అని. కట్ చేస్తే..