S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డా.మోహన్బాబు ప్రధాన పాత్రలో ‘గాయత్రి’ అనే చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లోగోకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆర్ఎఫ్సిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. విష్ణు నేటినుండి షూటింగ్ ప్రారంభించారు. శ్రీయ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ఢీ-2 టెలివిజన్ డాన్స్ షో విన్నర్, మా టీవీ అవార్డు గ్రహీత, భారత ఆర్ట్స్ అకాడమీ ద్వారా గబ్బర్సింగ్ అవార్డును గణేష్ మాస్టరు అందుకున్నారు. సినీ కొరియోగ్రాఫర్గా పలువురు స్టార్ హీరోలతో పనిచేశారు. ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు ఆశీస్సులతో ఓసేయ్ రాములమ్మా చిత్రంతో కొరియోగ్రాఫర్గా పరిచయం అయ్యారు.
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, నిత్యామీనన్ల కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న నూతన చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోల ప్రారంభమైంది. కథానాయకుడు శర్వానంద్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ కథానాయకుడు నాగచైతన్య క్లాప్నివ్వగా, కెమెరా స్విచ్ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు.
ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న మానుషి చిల్లర్ ఒక్క రోజులో స్టార్డమ్ను దక్కించేసుకుంది. ఆమె మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న వెంటనే భారతదేశమంతటా ప్రముఖులందరూ ప్రశంసలు అందించారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఒక భారతదేశ మహిళ ఈ ఘనతను సాధించడం చాలా గొప్ప విషయమని చెప్పాలి. అయితే సాధారణంగా ఫ్యాషన్ వరల్డ్లో కిరీటాల్ని అందుకున్నవారు సినిమాల్లో నటించాలని అనుకుంటారు.
‘కృష్ణగాడి వీరప్రేమగాథ’లో హీరోయిన్గా తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మెరుపులు కురిపించింది అందాలభామ మెహ్రీన్. అందానికి తోడు టాలెంట్తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చక్కటి క్రేజ్ని సంపాదించుకుంది. ఆ తరువాత తనదైన ప్రత్యేక పాత్రలో నటిస్తూ పేరు తెచ్చుకున్న మెహ్రీన్ తాజాగా సాయిధరమ్తేజ్తో కలిసి నటిస్తున్న చిత్రం జవాన్.
పద్మావతికి పెద్ద గండమా.. ఏంటది? అని షాక్ అవుతున్నారా? పద్మావతి సినిమా మొదలుపెట్టినప్పటినుండి ఆ సినిమాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీపికా పదుకొనె టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నాడు. ఇక సినిమా విడుదల డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే గుజరాత్లో ఈ సినిమా విడుదల బ్యాన్ చేశారు.
మాటల రచయిత శ్రీ్ధర్ సీపాన దర్శకుడిగా మారారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్, వంగల ప్రభాకరరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘బృందావనమది అందరిది’ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ్ధర్ మాట్లాడుతూ ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్లో ఉన్నామని, మణిశర్మ అందించిన పాటలన్నీ బాగా వస్తున్నాయని తెలిపారు.
సప్తగిరి కథానాయకుడిగా సాయి సెల్యూలాయిడ్ సినిమా టిక్ క్రియేషన్స్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘సప్తగిరి ఎల్ఎల్బి’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 7న విడుదలకు సిద్ధమయింది. విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోలో తొలి పాటను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేయగా, రెండవ పాటను సాయి ధరమ్తేజ్ ఆవిష్కరించారు.
సంతోష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కన్నడంలో విజయవంతమైన రాజధాని చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. యష్, షీలా జంటగా నటించిన ఈ చిత్రానికి కెవి రాజు దర్శకత్వం వహించగా, సంతోష్కుమార్ తెలుగులో అనువదిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది.
సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె.జాన్బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ రూపొందించిన చిత్రం ‘తొలి కిరణం’. పి.డి.రాజు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు జాన్బాబు మాట్లాడుతూ- తెలుగు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేస్తున్నామని, ఏసు క్రీస్తు సినిమాలలో ఇప్పటివరకు రాని ఓ కొత్త పాయింట్తో ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపారు.