S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గ్లామర్ భామ త్రిష రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటినుండీ చేసిన సినిమాలన్నీ ఆమెకు ఎటువంటి లాభం ఇవ్వలేదు. ముఖ్యంగా అందరూ వెళ్ళే దారిలో వెళ్లి నాయకితో భయపెట్టి హిట్ కొట్టాలనుకున్నా ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇక ఇప్పుడు మరో హారర్ సినిమా చేస్తోంది. మలయాళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఆలోచనలో పడిందట.
మలయాళ నటుడు మోహన్లాల్, ఆమలాపాల్, సత్యరాజ్ ప్రధాన తారాగణంగా జోషి దర్శకత్వంలో కె.ఆర్.్ఫలింస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై కందల కృష్ణారెడ్డి తెలుగులో అందిస్తున్న చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే’. ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి.
నాని, అను ఇమాన్యుయేల్, ప్రియశ్రీ హీరో హీరోయిన్లుగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ పతాకంపై రూపొందిన మజ్ను చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్తో రన్ అవుతోన్న సందర్భంగా గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో హీరో నాని మాట్లాడుతూ, ‘మజ్ను సక్సెస్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వర్షాల కారణంగా ఓపెనింగ్స్ ఎలా వుంటాయోనని అనుకున్నాం. కానీ ఊహించినదానికంటే రెట్టింపు కలెక్షన్లు దక్కాయి.
ప్రముఖ నటుడు మహేష్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం చెన్నైలో జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ముంబైలో షూటింగ్కు షిప్ట్ కానుంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్పై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా ‘అభిమన్యుడు’ అనే టైటిల్ పెడుతున్నట్లు కోలీవుడ్లో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి.
అవికాగోర్, ఇషాడియోల్, కార్తిక్ జయరాజ్ ప్రధాన తారాగణంగా భీమవరం టాకీస్ పతాకంపై కిషన్ శ్రీకాంత్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులో అందిస్తున్న చిత్రం ‘మాంజా’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్లో నిర్వహించారు.
అక్కినేని మరో వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన ‘అఖిల్’ చిత్రం భారీ పరాజయం పాలవడంతో ఆ సినిమా తరువాత ఇంతవరకూ తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టలేదు అఖిల్. ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చలు జరిపినా కూడా ఏదీ ఫైనల్ కాలేదు. తాజాగా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయినట్టు నాగార్జున తెలిపారు.
మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది సంచలన విజయం సాధించిన ‘ఒప్పమ్’ చిత్రం త్వరలోనే తెలుగులోకి రీమేక్ కానుంది. మలయాళంలో కేవలం మూడు వారాల్లో 27 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను ఓవర్సీస్ నెట్వర్క్ సంస్థ స్వంతం చేసుకుంది. మోహన్లాల్ అంధుడిగా నటించిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కింది.
నూతన నటీనటులతో శే్వతశ్రీ క్రియేషన్స్ పతాకంపై జనార్దన్ శివలంకి దర్శకత్వంలో జె.వాసుదేవనాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘మనీ ఈజ్ హనీ’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
రామ్, రాశీఖన్నా జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ పతాకంపై తెరకెక్కిన ‘హైపర్’ ఈరోజు విడుదలవుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాతో మంచి హిట్ను అందుకుంటానని అంటున్నాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ‘కందిరీగ’ తరువాత రామ్తో చేస్తున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్తో ఇంటర్వ్యూ..
గ్యాప్ వచ్చింది
గ్లామర్ భామగా టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది రాశీఖన్నా. అందానికి అందం, అభినయం పుష్కలంగా వున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం రామ్ సరసన హైపర్ చిత్రంలో నటిస్తోన్న రాశీ, ఇటీవలే ‘సైతాన్ కా బచ్చా’ సినిమాతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కోలీవుడ్లో ఒక్క సినిమా కూడా చేయకుండానే రాశీఖన్నాకు భారీ క్రేజ్ నెలకొంది.