విశాఖపట్నం

నగరానికి రానున్న పవన్ కళ్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: జనసేన అథినేత పవన్ కళ్యాణ్ ఈనెల 30న నగరానికి వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యలపై ఆయన నెఫ్రాలజీ డాక్టర్లతో సమావేశం కానున్నారు. స్థానిక పిఎం పాలెంలో ఉన్న కనె్వన్షన్ సెంటర్‌లో ఆయన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి చర్చించనున్నారు. అలాగే, కిడ్నీ వ్యాధి మరింతగా ప్రబలకుండా, తీసుకోవలసిన చర్యలపై కూడా ఆయన డాక్టర్లతో చర్చిస్తారు. నెఫ్రాలజీ డాక్టర్లు ఈనెల 29న ఉద్దానం వెళ్లి బాధితులతో మాట్లాడనున్నారు. అక్కడి పరిస్థితులను మరోసారి తెలుసుకుంటారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉద్దానం వెళ్లి బాధితులను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డాక్టర్లు కూడా వెళ్లి పరిస్థితిని సమీక్షించిన తరువాత 30న విశాఖలో సమవేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం డాక్టర్ల బృందంతో కలిసి నేరుగా అమరావతి వెళ్లి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నారు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్‌కు ఆదివారం ఉదయం విమానంలో నగరానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్ వరకూ భారీ ర్యాలీతో ఆయనను తీసుకువచ్చేందుకు అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. నోవాటెల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని కనె్వన్షన్ సెంటర్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.