నల్లమడ ఆధునికీకరణకు రూ. 240 కోట్లు
Published Friday, 23 September 2016ప్రత్తిపాడు, సెప్టెంబర్ 23: నల్లమడ వాగు ఆధునికీకరణ పనులకు అవసరమైన 240 కోట్ల రూపాయల నిధులు త్వరలో మంజూరు చేయిస్తానని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రత్తిపాడు ఎండిఒ కార్యాలయంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు వరద ముంపునకు గురైన పంటల నష్టం అంచనాపై నియోజకవర్గ స్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ భారీవర్షాల వల్ల ప్రతి ఏడాది నల్లమడ ముంపుతో వేలాది ఎకరాలు నష్టపోవాల్సి వస్తుందని, వాగు ఆధునికీకరణకు 240 కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంత ప్రజలు, రైతులను ఆదుకుంటామన్నారు.