జూపల్లి వర్సెస్ రేవంత్
Published Friday, 10 June 2016కొడంగల్, జూన్ 9: మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలంలో గురువారం జరిగిన అభివృద్ధి పనుల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరూ వ్యక్తిగత దూషణలు పాల్పడ్డారు. ఈ సంఘటన కోస్గి మండలంలోని బోదారం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...గ్రామానికి మంజూరైన రోడ్లను పరిశీలించిన మంత్రి జూపల్లి అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గతంలో ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్ర సాధనకు అడ్డుతగిలారని, ప్రస్తుతం ప్రాజెక్టుల కోసం మళ్లీ అడ్డుతగులుతున్నారని నిప్పులు చెరిగారు.