అయ్యో..పాపం!
Published Friday, 10 June 2016హిందూపురం, జూన్ 9 : దేశాలు దాటుకుని సంతానోత్పత్తి కోసం దశాబ్దాల కాలంగా వస్తున్న విదేశీ అతిథులు పాపం... అర్ధాకలితో చనిపోతున్నాయి. హిందూపురం నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు మండలం వీరాపురానికి ఎర్రమూతి కొంగలు (సైబీరియన్ పక్షులు) ప్రతియేటా విచ్చేస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా పెద్దసంఖ్యలో విదేశీ విహంగాలు సంతానోత్పత్తి కోసం వీరాపురం చేరుకున్నాయి. అయితే గతంలో తరహాలోనే ఆహారం కోసం పక్షులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.