గైర్హాజరైతే కఠిన చర్యలు
Published Friday, 10 June 2016హైదరాబాద్, జూన్ 9: వైద్యులు తమ సేవల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని, పదే పదే విధులకు గైర్హాజరయ్యే వైద్యులపై కఠిన చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైద్యుల బదిలీలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గురువారం నాడు ఆయన హైదరాబాద్లో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. బదిలీల ప్రక్రియ శుక్రవారం నుండి 10 రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. బదిలీలు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు.