ఆలయం కూల్చవద్దంటూ ఆత్మహత్యాయత్నం
Published Friday, 10 June 2016విజయవాడ: ఇక్కడి కృష్ణానదీ తీరంలో సీతమ్మవారి పాదాల వద్ద శనీశ్వరాలయాన్ని కూల్చివేయరాదని ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించాడు. పుష్కర ఘాట్ల నిర్మాణాలను మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే బోండా ఉమా, మేయర్ శ్రీధర్ పరిశీలించి శనీశ్వరాలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. అయితే, అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు కలుగజేసుకుని ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు.