-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
జకార్తా, ఆగస్టు 31: 36ఏళ్లుగా ఎదురు చూసిన కలను సాకారం చేసుకోవడంలో భారత మహిళా హాకీ జట్టు విఫలమైంది. దాదాపుగా ఖాయమైన స్వర్ణాన్ని అందుకునే ప్రయత్నంలో దారుణంగా విఫలమైంది. ఆరంభం నుంచీ అప్రతిహత విజయాలతో ఫైనల్కు చేరిన భారత జట్టు, శుక్రవారం ఫైనల్ మ్యాచ్లో జపాన్పై 1-2తో ఓటమిపాలైంది.
జకర్తా: ఆసియా క్రీడల స్క్వాష్లో భారత్కు మరో పతకం దక్కనుంది. మహిళల స్క్వాష్ టీమ్ ఫైనల్ పోరులోకి భారత్
ప్రవేశించింది. మలేసియాతో జరిగిన సెమీ ఫైనల్లో జోష్న చినప్ప, దీపిక పల్లికల్, సునయన కురువిల్లా, తన్వి ఖన్నాతో
కూడిన భారత జట్టు 2-0తో గెలుపొందింది
జకార్తా: ఆసియా క్రీడల్లో భారత్ ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతున్నది. మరో మూడు రోజుల ఈవెంట్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, భారత్ అనూహ్యంగా పుంజుకుంటుందని అనుకోవడానికి వీల్లేదు. అయితే, 2014 ఏషియాడ్తో పోలిస్తే, మొత్తం పతకాల సంఖ్యలో ఈసారి ముందంజలో ఉంది. గత ఆసియా క్రీడల్లో భారత్కు 11 స్వర్ణం, 10 రజతం, 36 కాంస్యాలతో మొత్తం 57 పతకాలు లభించాయి.
హైదరాబాద్, ఆగస్టు 30: ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్ ఫైనల్లో ఓటమి చెందినంతమాత్రాన తానేమీ నిరాశపడడం లేదని, భవిష్యత్తులో ఇలాంటి మ్యాచ్లు ఎన్నో ఆడాల్సి ఉంటుందందని, వాటిలో అద్భుత ప్రదర్శన కనబరచడం ద్వారా గోల్డ్ మెడల్ తప్పకుండా సాధిస్తాననే గట్టి నమ్మకం ఉందని భారత షట్లర్ పీవీ సింధు వ్యాఖ్యానించింది.
బెంగళూరు, ఆగస్టు 30: టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కోచ్, మెంటర్గా ఎంపికయ్యాడు. ఇంతవరకు ఈ బాధ్యతలను నిర్వహిస్తున్న డేనియల్ వెటోరి గత కొన్ని సీజన్లలో జట్టును ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. దీంతో అతనిని జట్టు యాజమాన్యం తప్పించి గ్యారీ కిర్స్టన్ను ఎంపిక చేసింది.
సౌతాంప్టన్ (ఇంగ్లాండ్), ఆగస్టు 30: ఇక్కడి రోజ్ బౌల్లో గురువారం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభమైన నాలుగో టెస్టు మ్యాచ్లో ఆతిధ్య జట్టు తొలి ఇన్నింగ్స్లో 76.4 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో శామ్ కుర్రన్ (78), మొరుూన్ అలీ (40) మినహా మిగతా బ్యాట్స్మెన్లెవరూ ఆశించిన స్కోరు చేయడంలో విఫలమయ్యారు.
న్యూయార్క్, ఆగస్టు 30: అమెరికా టెన్నిస్ స్టార్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న అక్కాచెల్లెళ్లు వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ మరోసారి పరప్సరం ఢీకొనందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో వీరు తలపడనున్నారు.
సౌతాంప్టన్: ఇంగ్లాండ్తో టెస్ట్ పరాభవాల అవమానంతో రగిలిన టీమిండియా, థర్డ్ టెస్ట్లో సత్తా చాటుకుంది. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్తో సమవుజ్జీ కోసం సమాయత్తమైంది. థర్డ్ టెస్ట్లో అవకాశాన్ని చేజార్చుకున్న ఇంగ్లీష్ జట్టు, ఫోర్త్ టెస్ట్తోనే సిరీస్కు ఫుల్స్టాప్ పెట్టే తలంపుతో బరిలోకి దిగుతోంది. సౌతాంప్టన్లో నేటినుంచి మొదలవుతున్న నాల్గవ టెస్ట్ పోరులో ఎవరిది పైచేయి అన్నది ఆసక్తికరమే.
జకార్తా, ఆగస్టు 29: ఆసియా వేదికలపై భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. ఊహకందని రికార్డులతో ‘గోల్డెన్’ హిస్టరీ తిరగరాస్తున్నారు. పదిరోజుల్లో పసిడి పతకాల సంఖ్యను పదకొండుకు చేర్చి, ఖేల్ ఇండియాకు కొత్త నిర్వచనమిచ్చారు. హెప్ట్థ్లాన్లో స్వప్న బర్మన్ హీరోచిత పోరాటాన్ని ప్రదర్శించి ‘స్వర్ణ బర్మన్’ అవతారమెత్తింది.
జకార్తా: హర్యానాకు చెందిన 31 ఏళ్ల మన్జీత్ సింగ్ ఓ నిరుద్యోగి. జాతీయస్థాయిలో ఒక్క పతకాన్నీ సాధించిన రికార్డు లేదు. ఆసియా గేమ్స్లో 800 మీటర్ల పరుగుకు అర్హత సాధించినపుడూ అతనిపై ఆశలు లేవు. ఫైనల్స్కు అర్హత సాధించినపుడూ పతకం సాధించగలడన్న నమ్మకం కుదరలేదు. కానీ ఫైనల్ బీట్లో మన్జీత్ అనూహ్య వేగాన్ని ప్రదర్శించాడు. భారత్ తరఫున ఫేవరెట్గా దిగిన జిన్సన్ జాన్సన్ను అధిగమించాడు.