-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, ఆగస్టు 22: రియో ఒలింపిక్స్ మహిళల మారథాన్ పోటీలో పాల్గొన్నప్పుడు భారత అధికారుల నుంచి తనకు ఎలాంటి సహాయం అందలేదని, ఒకానొక దశలో ప్రాణం పోతుందేమోనని భయపడ్డానని అథ్లెట్ ఒపి జైష వాపోయింది. బలవర్ధకమైన ఆహారం, పానీయాన్ని అందించాల్సిన అధికారులు కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేదంటూ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
దిల్లీ: రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన పీవీ సింధు, కాంస్య పతకం సాధించిన సాక్షిమాలిక్, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దీపా కర్మాకర్(జిమ్మాస్టిక్స్), జీతూరాయ్(షూటింగ్)లను ఖేల్రత్న పురస్కారానికి సోమవారం ఎంపిక చేశారు.
అగర్తల: రియో ఒలింపిక్స్లో పతకం గెలవలేకపోయానని, 2020 టోక్యో ఒలింపిక్స్లో తప్పకుండా పతకం గెలుస్తానని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ప్రమాణం చేసింది. రియో ఒలింపిక్స్ ఫైనల్లో ప్రమాదకర ప్రొడునోవా విన్యాసం చేసిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్కు సొంత రాష్ట్రం త్రిపురలో సోమవారం ఘనస్వాగతం లభించింది. కోచ్ బిశ్వేశ్వర్ నందితో కలిసి అగర్తల చేరుకున్న దీపకు పలువురు స్వాగతం పలికారు.
రియో డి జెనీరో, ఆగస్టు 21: సజావుగా సాగుతాయా లేదా అన్న అనుమానాల మధ్య ఆరంభమైన రియో ఒలింపిక్స్ ఆదివారం ముగిశాయి. 2020లో ఆతిథిమిస్తున్న టోక్యోకు ఒలింపిక్ సంబరం అధికారికంగా తరలి వెళ్లింది. మొత్తం 207 దేశాల నుంచి వచ్చిన 11,544 మంది అథ్లెట్లతోపాటు, కోచ్లు, అధికారులు పరస్పరం వీడ్కోలు చెప్పుకొని ఇంటి ముఖం పట్టారు.
రియో డి జెనీరో, ఆగస్టు 21: ఒక క్రీడలో పేరుప్రఖ్యాతులు ఆర్జించిన వారు మరో క్రీడలోనూ రాణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, కొత్తగా చేపట్టిన క్రీడలో ఏకంగా ఒలింపిక్ పతకాన్ని సాధించిన సంఘటనలు దాదాపుగా లేవు. ఎవరూ ఊహించిన ఈ ఫీట్ను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ సనెట్ విల్జియాన్ సాధించింది. రియో ఒలింపిక్స్ మహిళల జావెలిన్ త్రోలో ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 21: లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు, ఆతర్వాత కోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై చర్చించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలక మండలి సోమవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా లోధా కమిటీ ప్రతిపాదనలపైనే చర్చ సాగుతుందని సమాచారం.
రియో డి జెనీరో, ఆగస్టు 21: భారత రెజ్లింగ్ స్టార్ యోగేశ్వర్ దత్ రియో ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్ క్వాలిఫయింగ్ రౌండ్స్లోనే చిత్తయ్యాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్ రియోలోనూ రాణిస్తాడని, ఏదో ఒక పతకాన్ని గెల్చుకుంటాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 21: రియో ఒలింపిక్స్లో రజత పతకాన్ని సాధించిన బాడ్మింటన్ సూపర్ స్టార్ పివి సింధుపైనే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. నిన్న మొన్నటి వరకూ ఎవరూ పట్టించుకోని బాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, మహిళల రెజ్లింగ్, లాంగ్ డిస్టెన్స్ పరుగు తదితర ఈవెంట్స్ ఇప్పుడు దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బాడ్మింటన్పై, అందులోనూ సింధుపై చర్చ సాగుతోంది.
హైదరాబాద్, ఆగస్టు 21: రియో ఒలింపిక్స్లో రజత పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు నగరానికి వస్తున్న సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్), తెలంగాణ బాడ్మింటన్ సంఘం సంయుక్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. సింధు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు విమానంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటుంది. విమానాశ్రయంలో ఆమెకు తెలంగాణ బాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.
హైదరాబాద్, ఆగస్టు 21: రియో ఒలింపిక్స్ మహిళల బాడ్మింటన్ సింగిల్స్లో రజత పతకాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి పివి సింధు స్వదేశానికి బయలుదేరిందన్న వార్త విన్న క్షణం నుంచే హైదరాబాద్లో ఉత్కంఠ నెలకొంది. సింధుకు స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. గచ్చిబౌలి స్టేడియంలో ఆమెకు సన్మాన కార్యక్రమానికి జిహెచ్ఎంసి అన్ని ఏర్పాట్లు చేసింది.