-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, ఏప్రిల్ 15: శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఆదివారం ఒక్క రోజే జరగనున్నాయి. ముస్లిం, ఎస్టి రిజర్వేషన్లు, జిఎస్టి, హెరిటేజ్ బిల్లులపై చర్చించి ఆమోదించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి)లో నిర్ణయించారు. శనివారం సాయంత్రం స్పీకర్ ఎస్. మధుసూదనా చారి అధ్యక్షతన జరిగిన బిఎసి సమావేశంలో ముఖ్యమంత్రి కె.
ముస్లింలకు 12 శాతం , ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు
కోటా 62 శాతం
రాష్ట్రంలో పెరగనున్న రిజర్వేషన్ల మొత్తం
పెంపును ఆమోదించిన కేబినెట్
జిఎస్టీ, హెరిటేజ్ బిల్లులకూ ఓకే
ఎస్ఆర్ఎస్పి ఎత్తిపోతలకు అనుమతి
ప్రభుత్వోద్యోగులకు 3.66 శాతం డిఎ
ఆదిలాబాద్లో కెవివికి 10 ఎకరాల స్థలం
పోలీస్ బెటాలియన్కు 111 ఎకరాలు
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్, ఏప్రిల్ 14: భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు రాష్ట్ర ప్రజలు ఘన నివాళి అర్పించారు. శుక్రవారం అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూల దండలు వేసి నివాళి అర్పించేందుకు తెలంగాణనుంచి పెద్ద ఎత్తున ప్రజలు పొటేత్తారు. దీంతో ట్యాంక్బండ్ పరిసరాలు కిటకిటలాడాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 14: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డిఎ ప్రభుత్వం పాత నోట్లను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం ఫలితంగా పేదలు, బడుగు వర్గాల వారికి మరిన్ని సంక్షేమ నిధులు పోగయ్యాయని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. శుక్రవారం ఆయన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు.
హైదరాబాద్, ఏప్రిల్ 14: ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు కూలీ నంబర్ వన్గా నిలిచారు. టిఆర్ఎస్ వరంగల్ బహిరంగ సభ కోసం వారం రోజుల పాటు కూలీ దినాలు జరపునున్నారు. కూలీ దినాల్లో భాగంగా మంత్రి కెటిఆర్ శుక్రవారం సుచిత్రా సర్కిల్ సమీపంలో ఐస్క్రీమ్ పార్లర్లో ఐస్క్రీమ్ అమ్మారు. ఇప్పటి వరకు జరిగిన టిఆర్ఎస్ కూలీ దినాల్లో కెటిఆర్ మొదటి స్థానంలో నిలిచారు.
హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బిసిలకు, దళితులకు కూడా వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. శుక్రవారం గాంధీభవన్లో జరిగిన పిసిసి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసిలకు క్రీమిలేయర్ అడ్డంకులు తొలగించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 14: గత ఆర్థిక సంవత్సరంలో పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడిన 933 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడకుండా మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. పిల్లలకు మరింత మెరుగైన కుటుంబ సంరక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
హైదరాబాద్, ఏప్రిల్ 14:పన్నుల భారం ఎక్కువగా ఉండడం వల్ల కొందరు పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారని, పన్నులు విధానం శాస్ర్తియంగా ఉండాలని, జిఎస్టితో అది సాధ్యం అవుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శాస్ర్తియమైన పన్నుల విధానమే పన్ను చెల్లింపు దారునికి, ప్రభుత్వానికి ఉభయ తారకంగా ఉంటుందని అన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 14: ఎన్ఆర్ఐ మధుకర్ భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోని సియోటిల్ నగరంలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గూడూరు మధుకర్ ఈనెల 3న ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణం తర్వాత స్వాతి రెడ్డి(34) నగరంలోని ఆర్కెపురం సౌభాగ్యపురం కాలనీలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.
హైదరాబాద్, ఏప్రిల్ 14: గత రెండున్నర ఏళ్లుగా రాష్ట్రంలో సాధించిన అభివృద్ధితో పాటు వచ్చే రెండున్నర ఏళ్లలో సాధించే అభివృద్ధిని ప్రజలకు వివరించడమే ధ్యేయంగా ప్లీనరీని నిర్వహించేందుకు తెరాస నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.