S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/21/2017 - 02:57

గుంటూరు, నవంబర్ 20: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని గ్రామాల్లో వౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సోమవారం శాసనసభలో ఉపాధి హామీ పథకంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా 16వేల 200 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ గడచిన మూడున్నరేళ్లలో రూ.

11/21/2017 - 02:56

విజయవాడ, నవంబర్ 20: ఏపీఎస్‌ఆర్టీసీ సుదీర్ఘకాలంగా అంతులేని నష్టాలతో నడుస్తున్న మాట వాస్తవం.. అయితే పలు సంస్కరణలు.. పొదుపు చర్యల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి లాభాలను చూపలేకపోయినా నష్టాలు లేకుండా నడపాలనే ధ్యేయంతో పనిచేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆర్టీసీ రాబడికి గండి కొడుతున్న ఆటోల అక్రమ రవాణాపై ఇక ఉక్కుపాదం మోపుతామన్నారు.

11/21/2017 - 02:54

గుంటూరు, నవంబర్ 20: ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం చెప్పిన మీదటనే అందుకు సమానమైన ప్యాకేజీకి సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని, హోదా ఇస్తామంటే తమకేమీ అభ్యంతరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

11/21/2017 - 00:27

విజయవాడ, నవంబర్ 20: శాసన మండలిలో ప్రశ్నలు వేసి గైర్హాజరైన వైకాపా ఎమ్మెల్సీలను పిలవాల్సిన అవసరం లేదని రాష్ట్ర లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభలో లేని సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నామని, వారికి ఒక సారి ఫోన్ చేసి ఆహ్వానించాల్సిందిగా మండలి చైర్మన్ ఫరూఖ్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సూచించారు.

11/21/2017 - 00:26

విజయవాడ, నవంబర్ 20: గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించామని, దీనిపై ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం తెలిపారు.

11/21/2017 - 00:26

విజయవాడ, నవంబర్ 20: వెనుకబడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన చేతివృత్తుల వారికి అధునాతన మెరుగైన చేతి పనిముట్లు కిట్లను సమకూర్చడం కోసం తొలుత రూ.250 కోట్ల అంచనా వ్యయంతో ఆదరణ పథకాన్ని అమలుచేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు.

11/21/2017 - 00:25

విజయవాడ, నవంబర్ 20: రోగాలకు ఆంధ్రప్రదేశ్ హెడ్‌క్వార్టర్స్‌గా మారిందని ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి వ్యంగ్యాస్త్రాలను సంధించారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ గిరిజన ప్రాంతంలో ఆంత్రాక్స్ ప్రబలడంపై సోమవారం ఆయన ప్రశ్నించారు. దీనిపై మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందిస్తూ, పశువులకు అంత్రాక్స్ సోకిన కేసులు 2, మనుషులకు సోకిన కేసులు 14 నమోదు అయ్యాయని వివరించారు.

11/21/2017 - 00:25

విజయవాడ, నవంబర్ 20: రాష్ట్రంలోని 970 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో దాదాపు రూ.20వేల కోట్లతో కోస్టల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంకల్పంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శాసనసభ సమావేశాల ఐదవ రోజైన సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో తీరప్రాంత కారిడార్‌పై సభ్యుడు ఐతాబత్తుల ఆనందరావు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

11/21/2017 - 00:24

విజయవాడ, నవంబర్ 20: గతంలో బతకలేక బడిపంతులు.. నేడు బతకలేని స్థితిలో న్యాయవాది అంటూ సోమవారం శాసనసభ జీరో అవర్‌లో బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రస్తావించారు. రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడతానని పాదయాత్రలో చంద్రబాబు ఇచ్చిన హామీ అమల్లోకి వచ్చేలా చూడాలని కోరారు. సంక్షేమ నిధికి కార్ఫస్ ఫండ్‌ను సమకూర్చాలన్నారు.
శిథిలావస్థలో తుఫాన్ షెల్టర్లు

11/21/2017 - 00:24

విజయవాడ, నవంబర్ 20: రాష్ట్రంలో ఆరోగ్య వ్యాపారం ఎక్కువైందని, గతంతో పోలిస్తే, వైద్య సేవలు మెరుగైనప్పటికీ, ఇంకా మెరుగుపరచాల్సి ఉందని పలువురు ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర శాసన మండలిలో ఆరోగ్యంపై స్వల్పకాలిక చర్చ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 80 మంది ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు.

Pages