-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, జనవరి 7: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వచ్చే మార్చి నెలలో సరళతర వాణిజ్యంపై ప్రత్యేకంగా రెండో సూచీని ఏర్పాటు చేయనుంది. సరళతర వాణిజ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును ఈ సూచీ అంచనా వేసి ర్యాంకింగ్ ఇస్తుందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
న్యూఢిల్లీ, జనవరి 7: పది జాతీయ కార్మిక సంఘాలు సంయుక్తంగా బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈక్రమంలో దేశ వ్యాప్తంగా బ్యాంకుల్లో లావాదేవీలకు ఆటంకం కలుగనుంది. ఇప్పటికే మెజారిటీ శాతం బ్యాంకులు ఈ సమ్మె విషయాన్ని స్టాక్ ఎక్చేంజీలకు తెలియజేయడం జరిగింది.
ముంబయి: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. బీఎస్ఈ సెనె్సక్స్ ఏకంగా 788 పాయింట్లు పడిపోవడంతో ఇనె్వస్టర్లు కకావికలయ్యారు. లావాదేవీలు ముగిసేనాటికి గత ఆరు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా 787.98 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ 40,676.63 వద్ద ముగిసింది.
న్యూఢిల్లీ, జనవరి 6: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ఫలితంగా చమరు రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. భారత్లో సోమవారం నుంచి పెట్రోలు రేటును లీటరుకు 15 పైసలు చొప్పున, డీజిల్ లీటరు 17 పైసలు చొప్పున కంపెనీలు పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర బ్యారల్కు 70 డాలర్లు చేరుకోవడంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరల పెంపు అనివార్యమైంది. ఢిల్లీలో పెట్రోలు లీటరు తాజా రేటు ప్రకారం 75.69 పైసలు.
న్యూఢిల్లీ, జనవరి 6: మార్కెట్ల ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సురక్షిత పెట్టుబడులపైనే మదుపుదారులు దృష్టి పెట్టడంతో బంగారం పంట పండింది. దేశ రాజధానిలో సోమవారం 10 గ్రాములకు ఏకంగా 720 రూపాయల మేర బంగారం రేటు పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర 41,730 రూపాయలకు చేరుకుంది. వెండి కొనుగోళ్లపై కూడా మదుపుదారులు దృష్టి పెట్టడంతో దీనిపై రేటు కూడా కిలోకు 1,100 రూపాయల చొప్పున పెరిగింది.
న్యూఢిల్లీ, జనవరి 6: మధ్య ప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా వరుసగా రెండు సెషన్లలో భారతీయ మార్కెట్లు భారీగా నష్టపోవడం వల్ల దాదాపు 3.36 లక్షల కోట్ల రూపాయల మేర ఇనె్వస్టర్ల సంపద హరించుకుపోయింది. వరుసగా రెండో సెషన్లో కూడా ఈక్విటీ మార్కెట్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. బీఎస్ఈ దాదాపు 800 పాయింట్లు నష్టపోవడం వల్ల ఇక్కడ లిస్టయిన కంపెనీల ఉమ్మడి సంపద 3 లక్షల 36 వేల కోట్ల రూపాయల మేర ఆవిరైపోయింది.
న్యూఢిల్లీ: ఏడాదికి లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువు విద్యుత్ బిల్లు చెల్లించేవారు, ఇళ్లకు యజమానులు ఆదాయ పన్ను శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగమైన ఐటీఆర్-1 రిటర్న్ను దాఖలు చేయడానికి అనర్హులు. విదేశీ పర్యటనల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసిన వారిని కూడా ఆదాయ పన్ను శాఖ ఐటీఆర్-1కు అనర్హులుగా స్పష్టం చేసింది.
విజయవాడ పశ్చిమ, జనవరి 5: బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరల ఘాటు రానురానూ తగ్గుతోంది. గత నెలారంభంలో కిలో రూ.180 దాకా అమ్మిన ఉల్లిపాయలు క్రమేణా ధర తగ్గుతూ నేటికి కిలో రూ.60కి చేరింది. ఉల్లిపాయల ధరలను నియంత్రించలేని ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ ధరకు రైతుబజారుల ద్వారా కిలో రూ.25లకు అందించడంతో పేద, బడుగు వర్గాల ప్రజలే కాదు ధనికులు సైతం రైతుబజార్ల వద్ద క్యూలైన్లో బారులుతీరిన విషయం విదితమే.
న్యూఢిల్లీ, జనవరి 5: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)కి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఒడిసాలో ఈ సంస్థకు ఇచ్చిన 4000 మెగావాట్స్ సామర్థ్యంగల బొగ్గు గని లీజ్ను నిలిపివేసింది. అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కోల్ మైన్స్ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ముంబయి, జనవరి 5: అప్పుల ఊబిలో కూరుకుపోయిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్)పై ఒత్తిడి మరింతగా పెరుగుతున్నది. తమతమ క్లెయిమ్స్ను వెంటనే చెల్లించాలని ఫిక్స్డ్ డిపాజిట్దారులు పట్టుబడుతున్నారు. యూపీ పవర్ కార్పోరేషన్ (యూపీపీసీ)కు చెందిన ఉద్యోగులు ఎక్కువగా ఈ కంపెనీలో ఫిక్స్ డిపాజిట్స్ ఉంచారు.