S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/06/2020 - 01:33

న్యూఢిల్లీ, జనవరి 5: గత వారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసిన కారణంగా, ‘టాప్-10’ జాబితాలో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ పతనమైంది. ఐసీఐసీఐ అత్యధికంగా నష్టపోగా, ఈ ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ మొత్తంగా 26,624.10 కోట్ల రూపాయల మేరకు తగ్గింది.

01/06/2020 - 01:31

సీలేరు, జనవరి 5: విశాఖ ఏజెన్సీ ప్రాం తంలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో మేలురకమైన పసుపు పంట సాగు ప్రాజెక్టు చేపట్టనున్నారు. పసుపు సా గు ప్రాజెక్టుకు ఈ మేరకు నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఐటీడీఏఎ పీవో బాలాజీ తెలిపారు.

01/06/2020 - 01:31

న్యూఢిల్లీ జనవరి 5: వ్యవసాయోత్పత్తుల ఎగుమతి విధానానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయ ని కేంద్రం ప్రకటించింది. మిగతా రాష్ట్రాలు ఇంకా ఎలాంటి నిర్ధిష్టమైన ప్రణాళికను సమర్పించలేదని తెలిపింది.

01/05/2020 - 04:56

ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, ఇందుకు అన్ని దేశాలు సమష్టిగా కృషి చేయాలని ప్రముఖ ఆర్థిక శాస్తవ్రేత్త, నోబెల్ పురస్కార గ్రహీత ఎరిక్ స్టార్క్ మస్కిన్ పిలుపునిచ్చారు. అయితే, ప్రపంచ దేశాలన్నీ ఏకీభావంతో ముందుగా సాగడం అనుకున్నంత సులభం కాదని ఆయన స్పష్టం చేశారు.

01/05/2020 - 04:54

న్యూఢిల్లీ, జనవరి 4: ఈనెల 8న సార్వత్రక సమ్మెకు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సజావుగా సేవలు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు సిండికేట్ బ్యాంక్ ప్రకటించింది.

01/05/2020 - 04:53

చెన్నై, జనవరి 4: ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (ఐఓబీ)కి భారీగా పెట్టుబడి (కేపిటల్) నిధులు వచ్చి చేరాయి. భారత ప్రభుత్వం నుంచి 4,360 కోట్ల రూపాయలు వచ్చినట్టు ఈ బ్యాంక్ శనివారం స్టాక్ ఎక్ఛ్సేంజ్‌కి సమర్పించిన నివేదికలో తెలిపింది. ఈక్విటీ షేర్ల విడుదల ద్వారా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తాన్ని కేంద్రం సమకూరుస్తున్నట్టు తెలిపింది.

01/05/2020 - 04:51

హైదరాబాద్, జనవరి 4: ప్రయాణికులను ఆకర్శించడానికి నూతన సాంకేతిక సహకారంతో రైలు బోగీలను ఆధునీకరించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ అధికారులకు సూచించారు. శనివారం రేణిగుంట వద్ద ఉన్న రైల్వే బోగీల మర్మతుల వర్క్‌షాపు(క్యారేజ్ రిపేర్ షాప్)లో ఆయన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా క్యారేజ్ రిపేర్ షాపులో అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు.

01/05/2020 - 04:49

ముంబయి, జనవరి 4: పాత, కొత్త సంవత్సరాలకు వారధిగా నిలిచిన ఈవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. కొత్త సంవత్సరంలో రాజకీ య, ఆర్థిక రంగాల్లో రాబోయే మార్పులు ఏ విధం గా ఉంటాయో అర్థంకాని పరిస్థితుల్లో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా ఈవారం ట్రేడింగ్ జరిగిన ఐదు రోజుల్లో, రెండు రోజులు లా భాలు నమోదుకాగా, మూడు రోజులు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

01/03/2020 - 05:24

హైదరాబాద్: ఈనెల 6వ తేదీన తిరుమలలో జరగనున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈనెల 4వ తేదీన సికింద్రాబాద్- తిరుపతికి 07429 రైలును నడుపుతారు. అలాగే, తిరగు ప్రయాణంలో ఈనెల 6వ తేదీన తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు 07430 రైలును ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు.

01/03/2020 - 05:19

ముంబయి: నూతన సంవత్సరం తొలిరోజు మోస్తరు లాభాలతో శుభారంభాన్నిచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజైన గురువారం భారీ లాభాలను ఆర్జించి వాణిజ్య వర్గాల్లో జోష్ నింపాయి. సెనె్సక్స్ ర్యాలీ తీసి 320 పాయింట్లుకు పైగా లాభపడగా, నిఫ్టీ సరికొత్త జీవితకాల ముగింపుగరిష్ట స్థాయికి చేరింది. ప్రధానంగా వౌలిక, బ్యాంకింగ్, ఇంధన స్టాక్స్‌లో వాటాల కొనుగోళ్లు వెల్లువెత్తాయి.

Pages