S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/17/2019 - 02:23

ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్త, మహామేధావి స్టీఫెన్ హాకింగ్ ఓ సందర్భంలో ‘న్యూ సైంటిస్ట్’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక విచిత్రమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ‘నిత్య శాస్ర్తియ మేధాసంపన్నులైన మీకు ఎక్కువగా గ్రాహ్యం కాని ఆలోచన ఏమిట’ని ఇంటర్వ్యూలో జర్నలిస్టు ప్రశ్నించగా- ‘మహిళ’ అని జవాబిచ్చారు. మహిళ మనసులో ఏముం దో? ఆమె ఏం కోరుకుంటుందో అంతుపట్టని మిస్టరీ అని హాకింగ్ అన్నారు.

05/15/2019 - 01:53

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెలువడిన అనంతరం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో 19 రోజులు దుర్భర శారీరక వేదనతో మృత్యు పరిష్యంగంలో చిక్కుకొన్న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం విద్యార్థిని మానస- ‘ఆత్మహత్యలు చేసుకున్న వారి జాబితా’లో చేరింది. 17 ఏళ్ల విద్యార్థినిగా యువ జీవన ప్రాంగణంలో అడుగుపెట్టిన ఆమెకు పరీక్షా ఫలితాలు వెలువడిన రోజు (ఏప్రిల్ 18) మరణశాసనం లిఖించింది.

05/14/2019 - 01:52

నిర్మాణాల విషయంలో పాటించవలసిన నిబంధనలను రూపొందించి 2017 మార్చి 28న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ జీవో క్రమసంఖ్య 119. ఈ ఉత్తర్వు నిడివి 248 పుటలు. 119 అధ్యాయాలు, 5 అనుబంధాలతో కూడిన ఈ ఉత్తర్వును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీచేసింది. డాక్టరేట్ పట్టా కోసం విశ్వవిద్యాలయాలకు దాఖలు చేసే సిద్ధాంత వ్యాసాల నిడివి కూడా ఈ ఉత్తర్వు నిడివి అంత ఉండడం లేదు.

05/12/2019 - 01:37

క్రీస్తు పూర్వం 483వ సంవత్సరంలో బుద్ధుడు మహాపరినిర్వాణం చెందాడు. ఆయన 80 సంవత్సరాలు జీవించాడు. తన 39వ ఏట ‘జ్ఞానోద యం’ కలిగిందని భావించి, ఆ జ్ఞానాన్ని ఇతరులకు అందజేసేందుకు నాలుగు దశాబ్దాలపాటు నిరంతరం కృషిచేశాడు. 40 ఏళ్ళలో తాను నిర్మించిన, ఏర్పాటు చేసిన ‘సంఘం’లో- బుద్ధుని మరణానంతరం విభేదాలు పొడసూపాయి, చీలికలకు ‘నాంది’ పడింది.

05/11/2019 - 00:17

జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు. అవి ఒకటి కాలం, రెండోది ప్రాణం. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. భారతదేశ విద్యా వ్యవస్థలో పదవ తరగతి అనేది నిజంగా ఒక మైలురాయి వంటిది. విద్యార్థికి తన జీవన ప్రయాణంలో మొట్టమొదటి మెట్టు పదవతరగతి ఫలితాలు. విద్యార్థి తన గమ్యాన్ని ఎంచుకోవడంలో ఈ పది ఫలితాలు దోహదం చేస్తాయని, ఫలితాల ఆధారంగా లక్ష్య నిర్థారణ చేసుకోవాలి.

05/10/2019 - 01:26

జలమే జీవనాధారం అన్నది నానుడి. కానీ మన దేశంలో నీటి సంక్షోభం రోజురోజుకూ తీవ్రతరం అవడం, రానున్న కాలంలో త్రాగడానికి గుక్కెడు నీళ్ళుదొరుకుతాయా? అన్న ప్రశ్నకు ‘కాదు’ అనే సమాధానం వస్తోంది. 2040 సంవత్సరానికల్లా త్రాగునీటికి తీవ్ర కరువు ఏర్పడుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు ప్రజలకు త్రాగునీటిని అందించడానికి పెనుభారాన్ని మోస్తున్నాయి.

05/09/2019 - 01:27

గత ఐదేళ్ల కాలంలో మునుపెన్నడూ లేని మార్పులు మన దేశంలో చోటు చేసుకున్నాయి. రాజకీయ పార్టీల సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువైంది. మరో మార్పు ఏమంటే- విపక్ష పార్టీల తరఫున గెలిచిన నేతలు నిస్సిగ్గుగా అధికార పార్టీలోకి దూకడం. పార్టీ ఫిరాయించడం కొత్తగా జరుగుతున్న అనైతిక చర్య కానప్పటికీ ఇపుడు దాని తీవ్రత ప్రజాస్వామ్యంపై పడడం ఆందోళనకరం.

05/08/2019 - 01:35

మేడే.. మే నెల తొలి రోజు.. ప్రపంచ కార్మిక దినోత్సవం.. శ్రమజీవులు, ఉద్యోగులు ఉత్సాహంగా వేడుక జరుపుకుంటున్న వేళ మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లా దాదాపూర్ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరతో 15 మంది పోలీసు ఉద్యోగులను హతమార్చారు. బీభత్సం సృష్టించారు. ఏ ఎర్రని జెండా కార్మికులకు, ఉద్యోగులకు అండగా నిలుస్తుందని వారి రక్తంలోంచే ఆవిర్భవించినదిగా చెప్పుకునే జెండాకు మావోలు పోలీసు ఉద్యోగులను బలి ఇచ్చారు.

05/05/2019 - 01:57

దాదాపు దశాబ్దం క్రితం వరకు అంతర్యుద్ధంతో అతలాకుతలమైంది. ఆ రావణకాష్టం చల్లారిందనుకున్న సమయంలో మయన్మార్‌లోని ‘దృశ్యాలు’ శ్రీలంకలోనూ పునరావృతం కాసాగాయి. 2010 సంవత్సరం తర్వాత శ్రీలంకలో మత విద్వేషాలు పెరిగాయి. ఇందులో ముస్లిం మత ఛాందసవాదులు తమ ఆధిక్యతను చాటుకోవడానికి ఆగ్నేయాసియాలో అనుసరించిన విధానాలను శ్రీలంకలో ప్రవేశపెట్టడంతో రావణకాష్టం మరోసారి రాజుకుంది.

05/03/2019 - 23:04

నేటి ఆధునిక యుగంలో శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన క్రమంలో సమాచార వినిమయానికి ‘సామాజిక మాధ్యమాలు’ ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఇదే సమయంలో ముఖ్యంగా యువత కాలాన్ని వృథా చేసుకొని, సామాజిక మాధ్యమాలకు బానిస కావడం కలవరపెట్టే అంశం. సామాజిక మాధ్యమాల ప్రభావం పిల్లలపై, యువతపై రోజురోజుకు మితిమీరుతున్నందున , వారి వ్యక్తిత్వ నిర్మాణం అయోమయంగా మారుతోంది.

Pages