S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/17/2019 - 02:12

గౌతముడు తన 37వ ఏట 49 రోజులపాటు తనదైన శైలిలో ‘సాధన’ చేసి ఈ లోకంలోని అజ్ఞానానికి, దుఃఖానికి, బాధకు పరిష్కార మార్గం కనుగొన్నాడని అంటారు. ఎంతో కాలం చేసిన అనే్వషణ ఫలించిందని పేర్కొంటారు. దాంతో అతను బుద్ధుడయ్యాడని చెబుతారు. ఈ లోకంలోని దుఃఖానికి-బాధకు కారణం సంసారం, రాగద్వేషం, తృష్ణ (కోర్కె) అని సిద్ధార్థుడు గుర్తించాడని ఆయన అనుయాయులు- అభిమానులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు.

04/16/2019 - 05:13

అద్భుతాలకు నిలయమైన భారతదేశంలో తరతరాలుగా ఎన్నో కళలు వారసత్వ సంపదగా వర్థిల్లుతూ వచ్చాయి. ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు నాగరికతతోపాటు విలసిల్లుతూ తమ ప్రత్యేకతను నిలుపుకున్నాయి. చిటికి పద్ధతితో తయారైన వస్త్రాలను ఆనాటి రాజులు కూడా బాగా ఆదరించారు. ఇప్పటికీ కొన్ని మ్యూజియాలలో అప్పటి వస్త్రాలు కనిపిస్తున్నాయంటే వాటి ప్రత్యేకతేంటో అర్థంగాక మానదు.

04/14/2019 - 05:15

భారత్‌లో బౌద్ధ్ధర్మాన్ని పునరుద్ధరించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పూనుకున్నారు. 1956 అక్టోబర్ 14న పూణెలో దాదాపు ఐదు లక్షల మంది దళితులతో కలిసి ‘సమత’ను ఆశించి ఆయన బౌద్ధ్ధర్మాన్ని స్వీకరించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం దళితులను ఉత్తేజితుల్ని చేసింది. ‘హిందూ ధర్మాన్ని వీడి బౌద్ధ్ధర్మాన్ని ఆలింగనం చేసుకుంటున్నాను..

04/12/2019 - 22:52

తనపై కేసుల సంఖ్య పెరిగిందని ‘విప్లవ గాయకుడు’ గద్దర్ ఇటీవల అల్వాల్ (వెంకటాపురం)లో వాపోయారు. 22 ఏళ్ల క్రితం తనపై జరిగిన తూటాల దాడిలో నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంతవరకు మార్క్స్ సిద్ధాంతాలు, ఫూలే భావాల పాటతో పయనమయ్యానని ఇక ఇప్పుడు అంబేద్కర్ అడుగుజాడల్లో ‘జ్ఞానయుద్ధం’ చేస్తానని ప్రకటించారు.

04/12/2019 - 04:42

పసుపును సౌందర్య సాధనంగా, ఔషధంగా, ఆహార దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. పసుపుపంట వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. మహారాష్టల్రోని సాంగ్లీ పట్టణంలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో పసుపు వ్యాపారం జరుగుతోంది. పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాలలో విరివిగా పండుతోంది.

04/11/2019 - 01:18

పాకిస్తాన్‌లోనూ హిందువులున్నారు. కాని వారు ఎలాంటి పరిస్థితులలో బతుకున్నారు? ముఖ్యంగా మొన్న బాలాకోట్ సంఘటన తరువాత, వారి పరిస్థితి ఎలా తయారయింది? పాక్‌లోని సింధు ప్రాంతంలోని దర్హికి వద్ద ఇద్దరు మైనరు బాలికలు అపహరణకు గురయ్యారు. వారిని ఇస్లాం మతంలోకి మార్చేసి, బలవంతంగా వివాహాలు జరిపించారు. 15 సంవత్సరాల రీనా మెఘావర్, 13 సంవత్సరాల రవీనాలు హోలీ ఆడుతుండగా అపహరింపబడ్డారు.

04/10/2019 - 05:13

కేంద్రంలో కాంగ్రెసేతర, భాజపాయేతర పక్షాన్ని అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ‘ఫెడరల్ ఫ్రంట్’ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయి? 17 ఎంపీ సీట్లు కలిగిన తెలంగాణ రాష్ట్రం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం సాధ్యమవుతుందా? ఇంతకూ కేసీఆర్ వ్యూహమేమిటి? ప్రత్యామ్నాయం సాధించడంలో ఆయన సఫలీకృతులవుతారా? ఏం జరగబోతుందన్నది కొన్ని రోజుల్లో తేలిపోతుంది.

04/09/2019 - 04:23

దశాబ్ద కాలానికి పైగా మన దేశంలో ఏటా వేసవిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పేరిట క్రికెట్ పోటీలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ ధోరణి దేశీయ ఆటలపైన, క్రీడా సంస్కృతిపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వివిధ నగరాలలో దాదాపు 45 నుండి 50 రోజులపాటు ఈ పోటీలను చూసేందుకు చిన్నా పెద్దా అనే తేడాలేకుండా ఎగబడి టికెట్లను కొనుగోలు చేస్తున్నారు.

04/07/2019 - 02:13

ఆరోగ్యవంతమైన జీవన అలవాట్లను పెంపొందించుకోవడం వల్ల మనిషి ఆయుష్షు పరిమితి పెరుగుతుంది. ఆరోగ్యం అనేది మానవ హక్కు. మానసిక ఆరోగ్యం పెంపొందించుకుంటేనే ఎవరైనా శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో కాలంతోపాటు పరుగులు తీస్తూ మనిషి కూడా ఒక యంత్రం వలే మారిపోయాడు. మనిషి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదన వేటలో పడి, టార్గెట్ల సాధనలో పరుగులు తీస్తూ ఉన్నాడు.

04/05/2019 - 22:41

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్- లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ‘హంగ్’ వస్తుందనే పాట మొదలెట్టారు. తెలంగాణలో తమ పార్టీ 16 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటే చాలట! కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తెరాస ఎంపీలు కీలకమవుతారట. కేంద్రంపై ఇక పెత్తనం తమదేనట! కాబోయే ప్రధానమంత్రిని కూడా వారే నిర్ణయిస్తారట!

Pages