S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

03/31/2019 - 22:40

ఆ దారుల వెంబడిపోతే నవ్య సాహిత్య పూర్వ రంగంలోని భిన్నభిన్న వీధులలోకి వెళ్తాం. నవ్య సాహిత్య మూల స్తంభాలను చూస్తాం. నవ్య సాహిత్య విస్తరణను చూచి సంభ్రమ పడతాం. వివిధ కవితోద్యమాల గురించి తెలుసుకొంటాం. ఈ పుస్తకంలో మొదటి భాగం నవ్య సాహిత్య పూర్వరంగం. ఇందులో కురుగంటి, వీరేశలింగం పంతులు నుండి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు వరకు దాదాపు డెబ్భై మంది కవులు, రచయితలను పరిచయం చేశారు.

03/29/2019 - 19:01

ఈ సందర్భంగా సాహిత్యాదర్శాలలో, సంప్రదాయాలలో ఎదురుతిరిగి నవ్యత్వం కోరుతూ -వ్రాసినది నవ్య సాహిత్యం అవుతున్నదని, పాశ్చాత్య సంస్కారం మీద అభిమానంతో కూడిన భాషాతత్వం, చరిత్ర నిర్మాణం, సృష్ట్యాది కాలనిర్ణయం, సంఘ ధర్మాలు, విశ్వాసాలు వీటిని ఏఏ గ్రంథాలు పరామర్శిస్తాయో అదంతా నవ్య సాహిత్యం అవుతుందని విశ్వనాధ నవ్య సాహిత్యాన్ని నిర్వచించారు.

03/28/2019 - 19:04

నవ్యాంధ్ర సాహిత్య వీధులు ఆధునిక సాహిత్య చరిత్ర రచనలో మొదటిది. 1842 మేలో ఈ పుస్తకం వచ్చింది. ఆధునిక సాహిత్యం ఆవిర్భవించి అప్పటికింకా అర్థశతాబ్ది కూడా కాలేదు. ఆధునిక సాహిత్య వికాసానికి మహోజ్జ్వల కాలమది. ఆ కాలపు సాహిత్య వికాసానికి ప్రత్యక్షసాక్షి కురుగంటి సీతారామాచార్యులు. ఆధునిక సాహిత్యాభివృద్ధి క్రమంలో భాగస్వాములైన కవులతో, రచయితలతో ఆయనకు సన్నిహిత స్నేహ సంబంధాలున్నాయి.

03/27/2019 - 20:41

గోపీగారు పునర్ముద్రణ సమయంలోనైనా రాళ్లపల్లివారిపై వేసిన నింద తొలగిస్తారని భావిస్తాను. ఇంకను శర్మగారి ఆఖరి ఉపన్యాసంలో కూడా ఈ విషయం ప్రస్తావించారు. చూడండి.. తెలుగు ఛందస్సులలో నెల్ల చిన్నది యగు ఆటవెలది నితడు పరిగ్రహించెననవచ్చును. కందములు, తేటగీతి మొదలగు పద్యములు నితడు వాడినాడుగాని వానిలో చాలావరకు, ఈ చెక్కిన చక్కదనము, ఈ లగువు, ఈ బిగువు లేదు.

03/26/2019 - 19:23

మొత్తం గ్రంథంలో రాళ్లపల్లి వారి వ్యక్తిత్వం ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఒక సాహితీ లేఖ వారే అంటారు. ‘నా దృష్టిలో, నా వ్యవహారములో, విమర్శ ఒక శాస్తమ్రుగాదు. ఆ దృష్టితో నా విమర్శలు నేనెప్పుడును సాగింపలేదు. నాకు తోచినది అభిమాన సంప్రదాయములకు పూర్తిగా లొంగక స్పష్టముగా, వినీతిలో చెప్పవలెనని నా ప్రయత్నము. ఎవ్విర్రీ క్రిటిసిజమ్ ఈజ్ ఆన్ ఆటోబయోగ్రఫి అని ఒక తత్త్వదర్శి అన్నాడని విన్నాను.

03/25/2019 - 19:57

అప్పటికీ భగవంతుడు కనపడడు. ఈ స్థితిలో వేమనకు రసవాద విద్యాభినివేశంచేత యోగుల సంబంధం కుదిరి వుండవచ్చునంటాడు రాళ్లపల్లి. అయితే వేమన ఏ పని చేసినా తీవ్రంగా చేసే మనిషి కావడం చేత విద్యలకే విద్య బ్రహ్మవిద్య సంపాదించాలనుకుంటాడు.

03/24/2019 - 23:25

ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపన్యాసాలు స్వాతంత్య్రోద్యమం మహాత్మాగాంధీ నాయకత్వంలో ముమ్మరంగా సాగుతున్నకాలంలో వెలువడ్డాయి అన్న సంగతి. అందరి హదృయాల్లో విజృంభిస్తున్న దేశభక్తి భావాలే రాళ్లపల్లి నోట వచ్చాయి. సి.పి.బ్రౌన్ పట్ల గౌరవం ప్రకటిస్తూనే, ముద్రణ విషయంలో మనం సాధించాల్సిన స్వావలంబన గురించి ఆయన ఇక్కడ నొక్కి చెప్పారు.

03/22/2019 - 20:17

తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈఏడు ఉపన్యాసాలను పుస్తకరూపంలోకి తెచ్చాక, తెలుగు విమర్శలో ఒక కొత్త పోకడ వచ్చిందని రసలోకం గుర్తించింది. రాళ్లపల్లి తన ఉపన్యాసాలను తెలుగు విమర్శలో శిష్ట్భారుచి ప్రవేశపెట్టడానికి లక్ష్యాలుగా వాడారు. అప్పటివరకు ఒక కవిత్వతత్త్వ విచారం మినహాయించి- తెలుగు విమర్శ వ్యక్తిగత దూషణ భూషణాదులతో నిండి వుండేది. వేమనతో తెలుగు విమర్శ వనానికి వసంతం వచ్చినట్లయింది.

03/21/2019 - 22:32

సి.పి.బ్రౌన్, సి.ఆర్.రెడ్డి ఈ ఇద్దరు మహనీయులు తమవైన పద్ధతులలో వేమన కవితను సాహితీ ప్రపంచంలో సుప్రతిష్ఠించారు. సి.పి.బ్రౌన్ వేమన పద్యాలు ఆంగ్లీకరించి, అంతర్జాతీయ పాఠకుల హస్తాలలో ఉంచితే, సి.ఆర్.రెడ్డి వేమనపై తెలుగు ఉపన్యాసాలు ఇప్పించి, ఆ ఉపన్యాసాలు పుస్తకరూపంలో ప్రచురించి సాక్షాత్తు తెలుగువారికి వేమన కవితను ఎలా ఆస్వాదించాలో నేర్పించారు.

03/20/2019 - 22:45

ఒక విషయాన్ని ప్రతిపాదించి, దానికి సూచించి తాను మొదట ప్రతిపాదించిన అంశాన్ని సిద్ధాంతీకరించటం ఈ భాష్య విధానంలోని విశేషం. అయితే, ఆయన ప్రవేశపెట్టిన ఈ విలక్షణమయిన భాష్య పద్ధతిని ఆ తరువాత ఎవరూ అందుకోకపోవటం, లేదా అందుకోలేకపోవటం వల్ల ఆయన విధానం అద్వితీయంగానే ఉండిపోయింది.

Pages