S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

09/20/2018 - 19:33

ఒక పెళ్లయిన అమ్మాయి - భర్త ఊళ్లో లేనప్పుడు కొద్దిరోజుల పరిచయం మాత్రమే కలిగిన ఒక యువకుడిని సినిమాకు వెళ్దామని చెప్పి తీసుకువెళుతుంది. దారిలో ఆ యువకుడు ‘‘మనిద్దరం ఇలా తిరుగుతూ వుంటే నలుగురూ ఏమైనా..’’ అంటాడు. పెళ్లయిన అమ్మాయి ‘‘ఏడిశారు- నలుగురూ నలభైమందీ అనుకుంటే ఏం’’ అంటుంది.

09/19/2018 - 19:34

ఈ నాటకం తణుకు, విజయవాడ, నరసాపురం, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, బాపట్లలో జరిగిన పరిషత్తుల్లో ఉత్తమ రచనకో, ఉత్తమ నటుడికో, ఉత్తమ ప్రదర్శనకో ప్రథమ ద్వితీయ బహుమతులు వరుసగా అందుకుంది.

09/18/2018 - 19:04

ఇతర ముఖ్యపాత్రలకొస్తే జానకి- కవిగారికి తగ్గ యిల్లాలు. జానకి తండ్రి జగన్నాధం ఆచితూచి అడుగేస్తూ, సంసారశకటాన్ని గాడి తప్పకుండా నెట్టుకుంటూ సమాజాన్ని సమూలంగా అర్థం చేసుకున్న మధ్యతరగతి మేధావి. అందుకే అంటాడు మన దేశంలో కళలకీ, కవిత్వానికీ మాట విలువ తప్పించి, డబ్బు విలువ లేదు. కాని ప్రపంచంలో జీవితాలు మాటలతో గడవ్వు, డబ్బుతోనే గడుస్తాయి. ఇంకా ఎందుకయ్యా కవిత్వ పరిశోధన.

09/17/2018 - 19:37

మహాకవి వాణీనాధం రచించిన అమూల్య గ్రంథాన్ని పబ్లిషర్ శఠగోపం సర్వహక్కులతో కొన్న అగ్రిమెంట్‌మీద మురారిని సాక్షి సంతకం చేయమని కోరినపుడు మురారి తన బొటనవేలుని పెద్ద చాకుతో కోసుకుని రక్తంతో వేలుముద్రవేసి, ఆవేశంతో, ఆవేదనగా యిలా అంటాడు.

09/16/2018 - 22:16

వారి రచనలమీద సర్వహక్కులు వదిలితే, అందేది కేవలం పది రూపాయల నించి 20 రూపాయలు మాత్రమే.
ఇలాంటి హృదయ విదారక సంఘటనలు, అలనాటి సాంఘిక పరిస్థితులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తెలుసుకుని మూగబాధతో రోదించగా, తన మనసులో రగిలిన ఒక చిన్న నిప్పుకణం, కీర్తిశేషులు నాటకమని, రచయిత రాధాకృష్ణగారు స్వయంగా ఆవేదనతో అన్నారు.

09/14/2018 - 19:30

‘‘కావ్యేషు నాటకం రమ్యం’’
సాహిత్య రూపాలన్నింటిలో, ప్రజా హృదయాల్ని చూరగొనేటట్లు, కావ్య వస్తువుని సాక్షాత్కరింపజేయటంలో ప్రధానమైంది నాటకం. విషయ పుష్టి, భావరస పటుత్వం, శక్తివంతమైన కథా వస్తువుతోపాటు, సామర్థ్యంగల నటవర్గం కనుక వుంటే, ఆ నాటకం, ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

09/12/2018 - 19:29

వలపు తలపులధికమై, వరుసకు పుత్రుడైనా తన మోహాన్ని పలు రీతుల కోర్కెల తీర్చమని సారంగధరుని బతిమాలుతుంది. అతడంగీకరించకపోతే భగ్న ప్రేమికురాలై, వలపు పగయై కక్షగా మారుతుంది. రాజుకు చెప్పి శిక్ష విధించేలా చేస్తుంది. చివరికి తన తప్పిదాన్ని గుర్తించి ప్రాణత్యాగం చేస్తుంది. ఈ పాత్ర క్రమోన్మీలనంలో ధర్మవరం సజీవ పాత్ర చిత్రణా నైపుణ్యం స్పష్టం.

09/11/2018 - 19:07

సారంగధరుడు వెళ్లిపోతాడు. ఆ వెనుక రాజు రాగా సారంగధరుడు తనను బలాత్కరించాడని నింద మోపుతుంది. సారంగధరుని బంధించి న్యాయ విచారణ చేయించి, సారంగధరుడు తానుగానీ, తన పక్షాన వాదించే సాక్షిగాని లేకపోవడంవల్ల అతనికి కరపాద ఖండన శిక్ష విధిస్తాడు రాజు. ఆ వెనుక రాజరాజు తెలుసుకొంటాడు తప్పంతా చిత్రాంగిదేనని. రాజు వెంటనే శిక్షనాపమని లేఖ పంపినా అప్పటికే కరపాద ఖండన జరిగిపోయుంటుంది.

09/10/2018 - 18:42

‘‘కావ్యేషు నాటకం రమ్యమ్! నాటకేషు శకుంతలా!’’ అన్నట్లు శ్రవ్య కావ్యం కంటే దృశ్య కావ్యం రమ్యమైందనీ, నాటకాలన్నింటిలోకి కవికుల గురువు కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ శ్రేష్ఠమైందనీ పెద్దల సుద్దులు. అదేరీతిగా ఆధునిక యుగంలో వెలసి, ప్రఖ్యాతి గడిచిన ధర్మవరం రామకృష్ణమాచార్యులవారివి ముప్ఫై నాటకాలున్నా, వాటన్నింటిలోను వారి విషాద సారంగధర నాటకం పరమశ్రేష్ఠమైందనీ మనకు స్పష్టమవుతుంది.

09/07/2018 - 19:21

గోపీ అన్న చేసిన పనిని సమర్థింపలేకపోయాడు. లంచం సొమ్ము తిప్పిచేస్తానంటాడు. చెయ్యి మించిపోయిందంటాడు రంగనాథం.
ఇది ప్రధానంగా మొదటి రంగంలో నడిచిన కథాంశం.
ఇకరెండవ రంగం..
రంగనాథం మిత్రుడైన డాక్టరు, గోపి బస్టాండు దగ్గర పండ్లపొడి పొట్లా అమ్ముతున్నట్లు రంగనాథానికి చెప్తాడు. రంగనాథం కోపంతో వళ్లు మరిచిపోయి తమ్ముడ్ని చావబాదాడు.

Pages