S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/08/2019 - 22:01

అజ్మీర్, ఆగస్టు 8: దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టం వచ్చినా ముస్లిం మహిళలపై దారుణాలు కొనసాగుతునే ఉన్నాయి. అజ్మీర్‌లో 60 వ్యక్తి భార్యను చిత్రహింసలకు గురిచేయడంతోపాటు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. సలీముద్దీన్ అనే వ్యక్తిపై 25 ఏళ్ల అతడి భార్య దర్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై సెక్షన్ 498-ఏ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

08/08/2019 - 22:00

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఒక ప్రదేశాన్ని లేదా ఒక ప్రాంతా న్ని పార్టీగా ఎలా పేర్కొంటారని ‘రాం లీలా విరాజ్‌మాన్’ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

08/08/2019 - 00:15

మహేశ్వరం, ఆగస్టు 7: ఫార్మాసి సర్ట్ఫికెట్ లైసెన్స్ లేకుండా ఆక్రమంగా మందులు విక్రయిస్తున్న వ్యక్తికి మహేశ్వరం కోర్టు మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు లక్ష ఒక వేయి రూపాయల జరిమానా విధించినట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శైలజారాణి తెలిపారు.

08/08/2019 - 00:12

గుంటూరు, ఆగస్టు 7: రాష్ట్రంలో మరోమారు భారీ ఎత్తున డీఎస్పీల బదిలీలు జరిగాయి. రాష్టవ్య్రాప్తంగా 45 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ బుధవారం డీజీపీ గౌతం సవాంగ్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న 25 మందికి వివిధ విభాగాల్లో పోస్టింగ్‌లు కల్పించగా, ఆయా జిల్లాల్లోని సీఐడీ విభాగానకి 11 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. బదిలీ అయిన వారి వివరాలిలా ఉన్నాయి...

08/08/2019 - 00:11

కామారెడ్డి, ఆగస్టు 7: ఏడేళ్ల బాలికపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం గొట్టి ముక్కల గ్రామంలో 22ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడేళ్ల బాలికకు వైద్య చికిత్సఅందిస్తున్న జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్.

08/08/2019 - 00:00

హైదరాబాద్, ఆగస్టు 7: టీవీ-9 యాజమాన్య మార్పిడి వ్యవహారంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న వాటాదారుడు, సినీనటుడు శివాజీ అమెరికా వెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇటీవల శివాజీ అమెరికా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంపై శివాజీ దాఖలుచేసిన పిటిషన్‌పై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది.

08/07/2019 - 23:58

హైదరాబాద్ (గచ్చిబౌలి), ఆగస్లు 7: భర్త, అత్తమామల వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకొన్న సంఘటన హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి కాలనీలో చోటుచేసుకొంది. రాయదుర్గం పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా బుచ్చయ్యతోటకు చెందిన లక్ష్మణ రావు తిరుమల దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు.

08/07/2019 - 23:38

న్యూఢిల్లీ, ఆగస్టు 7: అయోధ్యనే శ్రీ రామ జన్మభూమి అని చెప్పేందుకు మీ వద్ద రెవెన్యూ రికార్డులు ఉన్నాయా? లేదా వౌఖికంగా చెప్పేందుకు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అని సుప్రీం కోర్టు ధర్మాసనం ఓ హిందూ సంస్థను ప్రశ్నించింది.

08/07/2019 - 23:30

హైదరాబాద్, ఆగస్టు 7: ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేసి తెలంగాణలో శాసనసభ, శాసనమండలి ప్రాంగణాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ బుధవారం నాటితో పూర్తయింది. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో ఉంచింది. గత నెల రోజులుగా పలు దఫాలుగా కొనసాగిన వాదనలను విన్న ఉన్నత న్యాయస్థానం దీనిపై తీర్పును రిజర్వులో ఉంచింది.

08/07/2019 - 23:18

విజయవాడ, ఆగస్టు 7: రాష్ట్రంలో సీపీఐ (మావోయిస్టు) కార్యకలాపాలపై నిషేధాన్ని మరో సంవత్సం పాటు రాష్ట్ర ప్రభ్వుం పొడిగించింది. మావోయిస్టుల కార్యకలాపాల వల్ల రాష్ట్రంలో ప్రజా జీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించి, ఆగస్టు 17, 2005న నిషేధం విధించారు. దీనిని కొనసాగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Pages