S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/05/2019 - 06:18

గౌహతి: దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో అపారంగా కేసులు పెండింగ్‌లో ఉండడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

08/04/2019 - 04:21

హిందూపురం, ఆగస్టు 3: మైనర్‌పై ఓ బాలుడు అత్యాచారం జరిపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురం పట్టణంలోని మేళాపురం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ బాలిక (9) తన అవ్వ నివాసం ఉంటున్న కోట ప్రాంతానికి గత మే 2వ తేదీ వెళ్లింది.

08/04/2019 - 04:01

గోకవరం, ఆగస్టు 3: తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోలో రెండు నెలల పాప కిడ్నాప్‌కు గురైందని పాప తల్లి తీవ్ర స్వరంతో హంగామా చేయడంతో ఆర్టీసీ డిపోలో ఉన్న ప్రయాణీకుల్లో తీవ్ర అలజడి నెలకొంది. రెండు నెలల పాప ఏ విధంగా కిడ్నాప్‌కు గురైందని ప్రశ్నిస్తే తాను బాత్‌రూమ్‌కు వెళ్ళి వస్తానని చెప్పి డిపోలో ఉన్న గుర్తుతెలియని మహిళకు పాపను అప్పగించానని తెలిపింది.

08/04/2019 - 03:35

లక్నో, ఆగస్టు 3: రెండేళ్ల క్రితం మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో అరెస్టయిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్‌ను సీబీఐ అధికారులు శనివారంనాడు సీతాపూర్ జిల్లా జైలులో ప్రశ్నించారు. కొన్ని గంటలపాటు అనేక అంశాలపై సీబీఐ త్రిసభ్య బృందం అతనిని ఉక్కిరిబిక్కిరి చేసింది. శుక్రవారం 19 సంవత్సరాల ఉన్నావో అత్యాచార బాధితురాలు, బంధువును కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

08/04/2019 - 01:57

హయత్‌నగర్, ఆగస్టు 3: రోడ్డు దాటుతున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం సికింద్రాబాద్ నుండి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారమతిపేటకు ఆర్టీసీ బస్సు (టీఎస్08యూబీ6299) జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ (ఎంహెచ్13 ఎఎక్స్4845) ఢీకొట్టిందని తెలిపారు.

08/04/2019 - 01:48

వనస్థలిపురం, ఆగస్టు 3: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయిని కిడ్నాప్ చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద రూ.47 వేల క్యాష్, కారు, సిల్వర్, గోల్డ్ రింగ్‌లు, నాలుగు సెల్‌ఫోన్‌లు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నట్లు తయారు చేసిన నకిలీ గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

08/04/2019 - 01:01

విజయవాడ (క్రైం) : అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మరో 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ తవ్వకాలపై 2014లో గురవాచారి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

08/04/2019 - 00:54

ఖమ్మం, ఆగస్టు 3: మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల ముగింపు రోజున పోలీసులు భారీ ఎన్‌కౌంటర్ చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా సీతాగోట అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న రిజర్వు పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.

08/04/2019 - 00:52

శ్రీనగర్ : జమ్మూ-కాశ్మీర్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడుతుండడాన్ని నిరోధించడం భారత సైనిక దళాలకు సవాల్‌గా పరిణమించింది. ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఏరి వేస్తున్నా, పుట్టుకుని వస్తూనే ఉండడంతో స్థానికంగా ఉద్రిక్తత, ప్రజల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయి.

08/03/2019 - 23:29

కైకలూరు, ఆగస్టు 3: పట్టణంలోని సీతయ్య హోటల్ బయట పార్క్ చేసి టిఫిన్ చేసేందుకు వెళ్లగా బైక్ పోయిన సంఘటనతో మోటారు సైకిళ్ళ దొంగను పట్టుకుని 17 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని గుడివాడ డీఎస్పీ ఎన్ సత్యానందం తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న బైక్‌లను, దొంగలను మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

Pages