S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/06/2019 - 01:46

మచిలీపట్నం, ఆగస్టు 5: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మైనర్ బాలిక కిడ్నాప్ మిస్టరీగా మారింది. సదరు మైనర్ బాలిక కిడ్నాప్ అయి నెలన్నర రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కిడ్నాపర్ ఆచూకీ లభ్యం కాలేదు. ప్రత్యేక పోలీసు బృందాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముమ్మరంగా కిడ్నాపర్ కోసం గాలిస్తున్నా ఫలితం లేకపోయింది. దీంతో సోమవారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంధ్రనాధ్ బాబు కిడ్నాప్ ఉదంతంపై స్పందించారు.

08/06/2019 - 01:36

శేరిలింగంపల్లి, ఆగస్టు 5: కుటుంబ కలహాలతో విడాకులు తీసుకున్న మహిళ మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులకు గురైంది. ఇంట్లో మతదేహంగా మారడంతో పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. చందానగర్ పోలీసుల కథనం ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి. పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 63లోని 15వ నెంబర్ గదిలో శే్వతా లక్ష్మీ (42) నివసిస్తుంది.

08/06/2019 - 01:36

ఉప్పల్, ఆగస్టు 5: నారపల్లిలో నివసిస్తున్న మజ్జి మోహన్ రావు(22) డ్రైవర్. అతడు అదే ప్రాంతంలో ఉన్న కిరాణ జనరల్ స్టోర్ వద్దకు వెళ్లి సిగరేట్ కోసం మహిళను దూషించాడు. అతన్ని మందలించి వదిలి పెట్టాలని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు మోహన్ రావును పిలిపించి కౌన్సిలింగ్ చేశారు.

08/06/2019 - 01:36

నేరేడ్‌మెట్, ఆగస్టు 5: సులభంగా డబ్బులు సంపాదించాలని పార్కింగ్ చేసిన వాహనాలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న ముఠా సభ్యులను అరెస్టుచేసి వారి వద్ద నుండి 28 లక్షల 70 వేల రూపాయలు విలువ చేసే 55 బైకులు స్వాధీనం చేసుకున్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. సోమవారం నేరేడ్‌మెట్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు.

08/06/2019 - 01:28

బాలాపూర్, ఆగస్టు 5: ఇంటి నుంచి ఎంతో హుషారుగా పాఠశాలకు బయలుదేరిన ఒక విద్యార్థి, ఓ యువకుడు పాఠశాల అతి సమీపంలో ప్రమాదానికి గురై అక్కడిక్కడే మృతిచెందిన సంఘటన సోమవారం మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధి బడంగ్‌పేట్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

08/05/2019 - 23:48

న్యూఢిల్లీ, ఆగస్టు 5: అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టులో మంగళవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. రాజ్యాంగ ధర్మాసనం రోజువారీ విచారణ జరపనుంది. కేసు విచారణ ప్రక్రియను రికార్డు చేయాల్సిందిగా సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రోజువారీ విచారణను ప్రత్యక్ష ప్రసారం/ రికార్డింగ్‌కు ఆదేశించాలని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త కేఎన్ గోవిందాచార్య అభ్యర్థించారు.

08/05/2019 - 05:38

బెళుగుప్ప/గోరంట్ల, బత్తలపల్లి, ఆగస్టు 4 : అనంతపురం జిల్లాలో ఆదివారం ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిలో ఒకరు మహిళా రైతు ఉన్నారు. వివరాలు.. బెళుగుప్ప మండల పరిధిలోని నరసాపురం గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు (62) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. రైతు ఆంజనేయులుకు 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

08/05/2019 - 01:45

నేరేడ్‌మెట్, ఆగస్టు 4: బంధువుల ఇంటికి వెళ్లి వచ్చెసరికి ఇంట్లో దొంగలు పడి బంగారు, వెండి అభరణాలు, నగదు దొచుకెళ్లిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్‌మెట్ సంతోష్‌నగర్‌లో నివసించే లక్ష్మీకాంత్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, శనివారం, ఆదివారం సెలవుదినం కావడంతో కూకట్‌పల్లిలో నివసించే బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లినట్టు తెలిపారు.

08/05/2019 - 01:45

కీసర, ఆగస్టు 4: ప్రమాదవశాత్తు విద్యార్థి కోనేరులో మునిగి మృతిచెందిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ గౌడ్ కథనం ప్రకారం.. మేడ్చల్ మండలం, కలాకల్ గ్రామానికి చెందిన శ్యాంసుందర్ (14) కీసరగుట్ట గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

08/05/2019 - 02:00

మిడ్జిల్ : మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం వ్యవసాయ కూలీ పనులు ముగించుకుని ఇంటింటి వెళ్తున్న సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. మరో ఐదు నిమిషాల వ్యవధిలో కూలీలు తమ ఇళ్లకు చేరుకునే వారే. కానీ, మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ వారిని పొట్టనబెట్టుకుంది.

Pages